మనం త్రాగే నీరు తియ్యగా ఉంటాయి. నదులలో, చెరువులో వుండే నీరు కూడా త్రగాటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ సముద్రంలో వుండే నీరు ఉప్పగా ఉండి త్రగాటానికి అనుకూలంగా ఉండవు. దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం.సముద్రపు నీటిలో అనేక లవణాలు ఉంటాయి. వాటిలో ఎక్కువగా ఉండేది సోడియం క్లోరైడ్ అనే లవణం. దీన్ని మనం సాధారణ ఉప్పు అంటాం. అతి తక్కువ మోతాదులో అనేక ఖనిజాలు, మూలకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ సముద్రపు నీటిలోకి ఎలా వచ్చాయి?
వర్షపు నీరు చాలా స్వచ్చమైనది అని మనకు తెలుసు. ఆ స్వచ్ఛమైన నీరు భూమి మీద పడగానే భూమిపైన వుండే అనేక లవణాలు కలుపుకుని మళ్లీ సముద్రంలోకి చేరతాయి. ఇలా చేరేటప్పుడు తనతో పాటు తీసుకుపోయిన లవణాలు సముద్రంలో కలిసి ఉప్పగా మారతాయి. మళ్లీ సముద్రపు నీరు అవిరిగా మారేటప్పుడు ఆ లవణాలు అక్కడే వదిలేసి స్వచ్ఛమైన నీరు మాత్రం పైకి వెళ్లిపోతాయి. అందువలనే సముద్రపునీరు ప్రతియేటా తన గాఢతను పెంచుకుంటూ పోతుంది. వందల ఏళ్లక్రితం సముద్రపు నీటిలో ఇప్పుడునంత గాఢత ఉండేది కాదు. ఏటేటా లవణ శాతం కొంచం కొంచం పెరుగుతూ పోతుండటం వల దాని గాఢత పెరిగింది.
మృత సముద్రంలో ఈ లవణం గాఢత ఎక్కువ. అందుకే ఇక్కడ మనిషి మునగనే మునగడు. నీటిపైన తెలుతూనే ఉంటాడు. నీటిపై తేలుతూ హాయిగా షికారు చేయవచ్చు. కూర్చొని పేపరు కూడా చదువుకోవొచ్చు. ఇక్కడ లవణ గాఢత ఎక్కువగా ఉండటానికి కారణం అన్ని సముద్రాలకన్న ఈ సముద్రం సముద్ర మట్టానికి బాగా దిగువున ఉండటమే.
సముద్రపు నీళ్లు ఉప్పగా ఉంటాయి ఎందుకు: ౼ దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి