ముసలి అవ్వ నాగమ్మ వంట్లో శక్తి లేక ప్రభుత్వ పాఠశాలదగ్గరున్న మర్రి చెట్టు కింద ఉంటూ పాఠశాలకు వచ్చే విధ్యార్థులుఉపాధ్యాయులు టిఫిన్ బాక్సుల్లో మిగిల్చి పెట్టిన ఆహారంతోజీవితం సాగిస్తోంది.పాఠశాలకు శలవు రోజున నాగమ్మకు ఉపవాసమే.పాఠశాలనివాస ప్రాంతాలకు దూరమైనందున అటు వచ్చేవారు కూడా లేరు.చెట్టు మాటున చిన్న ప్లాస్టిక్ సంచులు అట్టలకు చుట్టిగుడారంలా చేసుకుని నివశిస్తోంది..అక్కడ దొరికే మెతుకులకుఆశ పడి ఒక వీధి కుక్క తోడుగా ఉంటోంది.అవ్వ నాగమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.ఆమెవయసు, శరీర దీనావస్థను గమనించిన ప్రధానోపాధ్యాయుడుఆమెను అనాథ శరణాలయంలో ఆశ్రయం కల్పించారు.వాస్తవానికి అవ్వ నాగమ్మ పదిమందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ. పల్లెలో వయసులో ఉండేటప్పుడు నాగమ్మ భర్తతోబాగా బతికిన ఇల్లాలు. అడిగిన వారికి లేదనకుండా పెట్టినచెయ్యి ఆమెది.కిరాణా షాపులో భర్తకు చేతోడుగా ఉంటూ ఉన్న ఒక్కకొడుకును పట్నానికి పంపి పెద్ద చదువులు చదివించింది.హోదా ఉధ్యోగం పొందిన కొడుకు చెడు సహవాసాల పాలయాడు.పెద్దింటి పిల్లను ప్రేమ పెళ్లి చేసుకుని నిరక్షరాస్యులైనకన్నవాళ్లను నిర్దాక్షిణ్యంగా వదిలేసి విదేశాలకు వెళిపోయాడు.మనో వ్యాధితో నాగమ్మ భర్త మంచం పట్టాడు. వ్యాపారందివాలా తీసింది. దిగులుతో భర్త ఊపిరి ఆగింది. నాగమ్మఎవరూ లేని అనాధగా మారింది. మరో ఆధారం లేక పొట్టకూటి కోసం పట్నానికొచ్చి బిచ్చకత్తెగా మారింది ముసలి అవ్వనాగమ్మ.*. *. *
బ్రతుకు భారమైన అవ్వ: --కందర్ప మూర్తి , కుకట్ పల్లి , హైదరాబాదు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి