నా కనుల కొలనులోనిను చూసిన అర క్షణం....కలల దోసిళ్ళలో ఈతరానివైనాయి నా చూపులు....నీ వేణు గానంతోహృదయ ఫలకాన్నిసుతిమెత్తగా మీటాయి...నీ ప్రేమ పూరిత చూపులతోలలితంగా మదినిమేధోమథనం చేసాయి....నీ అందమైన సిరిమువ్వలఅడుగుల సవ్వడిఅడుగడుగునా నాలో మోహనరాగాలు జనియించాయి .....నిను చూసిన ఆ తొలి పొద్దుఉదయ కిరణాలలో ఒకచూపులోనే వేయి అర్ధాలభావనలు మదిలో మ్రోగెనులే ....నా ముగింపు జీవిత కధ లోచివరి క్షణం వరకునీ శ్వాస నై జీవిస్తా....హే కృష్ణా ననునీ చల్లని కనుల కొలనులోనిత్యం కలువ వలె పూయించు .....కాంతులీనే బృందావని లోకలకాలం కరుణ కాంతులునాపై వెదజల్లు .....!!
రాధ మది....:--మొహమ్మద్ .అఫ్సర వలీషా-- ద్వారపూడి (తూ గో జి )
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి