భీష్మ ఏకాదశి -ఇష్టపదులు : -- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 పాచికల నాడుతూ పరమాత్మ క్షణమాగె 
పాండవులు ప్రశ్నింప పదమంటూ పిలిచెను 
కురుక్షేత్రము నందు కురు పితామహ భీష్మ 
మూడు పక్షములుగా  పూర్తి అంపశయ్యను 
నిలిచియుండె నకటా నిల్పి కృష్ణ స్మరణ 
ధర్మ సూక్ష్మములడుగ ధర్మరాజాదులును 
తాతగారి చెంతకు తాపమనమున వెడలె 
గాయముల బాధకును గట్టి యుపశమనమిడ
కురువృద్ధుడిటు పలికె కూర్మి మనుమల జూచి 
"హే !ద్రౌపదీ వినుము,హెచ్చు కృష్ణభక్తిని 
కలిగియున్న గానీ కలుషితమాయె తనువు 
కురువంశ రక్షణకు కుటిలమై యోచించి 
అంపశయ్యను నేడు నల్లాడు చుంటిని!
హే,,కృష్ణ !నాతోడ నౌరసపు ధర్మములు 
జెప్పించు చుంటివే జాతిరక్షణ కొరకు
నీవేల దెలుపవూ నీరజాక్ష !"ని పలికె!
---------------------------------------------------
భీష్మ ఏకాదశి-ఇష్టపదులు -2
అనుభవముతో జెప్పు నట్టితత్వము మేలు 
తనకితానుగ నెపుడు తత్వమే పలుకదుగ
నేలతన తత్వమును నిరూపించు మొలకగ 
నీవిక యుపదేశము నీమనుమల కివ్వుము!"
అని హరియు పలుకగా నతిభక్తితో భీష్మ 
జలధినుండి గ్రహించు జలజము తీరుగాను 
ధర్మ సూత్రములనూ ధరవిష్ణు సహస్రము 
పాండవులకు దెల్పియు పరమాత్మను జేరెను!
కామెంట్‌లు