ఓ తమిళకవి రాసిన పుస్తకం శీర్షిక. అయిదేళ్ళ క్రితం వేలువడింది. పుస్తకపఠనం అలవాటులేని వారు ఈ పుస్తకం వంక ఒక్కమారు దృష్టిసారిస్తే పూర్తిగా చదివేంతవరకూ పుస్తకాన్ని కిందకు దించరనిపించే చిన్న చిన్న కవితలు వందకుపైనే ఉన్నాయి. ఇందులోని కవితలు ఒట్టి కవితలు కావు. ఒక్కొక్కటీ ఒక్కో ముత్యం. ఎన్నో అంశాలపై ఎన్నో రకాల కవితల పుస్తకాలుండొచ్చు. కానీ ఈ పుస్తకంపూర్తిగా పుస్తకాలకు సంబంధించినదే కొవడం విశేషం. కవిత అనేది ఎప్పుడూ వచ్చేది కాదు. ఎప్పుడో అప్పుడు వచ్చేదన్నారొకరు.ఇది కవితలతో అల్లిన పుస్తకం. ఓ కవిత విజయం సాధించడమంటే రాసినంత మాత్రాన సరిపోదు. చదివేవారినీ అది కట్టిపడెయ్యాలి. భాగస్వామిని చేయాలి. ఈ పుస్తకంలో అటువంటి కవితలు చాలానే ఉన్నాయి.ఈ పుస్తకంలోని తొలి కవిత....పది పక్షులతోమెలగినంత మాత్రానమీరుఓ పక్షి అయిపోరు!పది నదులతోమెలగినంత మాత్రానమీరుఓ నది అయిపోరు!పది పుస్తకాలతోమెలగి చూడండిమీరు పదకొండో పుస్తకమవుతారుమిమ్మల్ని చదివింపచేస్తారు!- అనే కవిత ఈ పుస్తకానికొక కిరీటం.ఈ పుస్తకంలో నించే మరొక కవిత....పుస్తకం చదివిన వారందరూజ్ఞానవంతులైపోరుకానీజ్ఞానవంతులందరూపుస్తకం చదివినవారేఅనే తేలిక మాటలతో పుస్తకాన్నంతా నడిపించడం ఎంతో నచ్చింది నాకు.ఈ కవితా సంపుటి ఈ ఒక్క పుస్తకానికే కాదుఅన్ని మంచి పుస్తకాలకూ సరిపోయే నిజం. మంచి పుస్తకంతో వెచ్చించే సమయం ఖర్చూ ఖర్చే కావు. అవి మన జీవితానికి పెట్టుబడులవుతాయి.ఓ తీపి పదార్థాన్ని తిన్న వ్యక్తి చెప్పినంత మాత్రాన తృప్తి పడకేగా మనమూ తిని చూస్తాం అతని మాట నిజమేనా అని తెలుసుకోవడానికి.ఈ పుస్తకం చదివిన ఆనందం నేను పొందినట్టు మీరూ పొందాలంటే దీనిని చదవాలి అని చెప్పాలనే ఉంది కానీ ఇది తమిళ పుస్తకం కావడం వల్ల తమిళం తెలిసినవారికే ఈ మాట చెప్పగలను. నేనీ మధ్య చదివిన పుస్తకాలలో ఇదొకటి కావడం నా భాగ్యం.
పుస్తకమనేది....!!:-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి