--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.


 ఊత పదం తెచ్చిన తంటా


        పద్మాపురం అను గ్రామంలో సోమిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు.  అతడు మహా పిసినారి. అంతేకాదు .అతడు తనకు లాభం లేనిదీ ఎటువంటి పని చెయ్యడు. అతని ఊత పదం" బుద్ధి లేదా" .

      ఆ గ్రామంలోనే రంగడు అనే యువకుడు ఉండేవాడు. వాడు ఆకతాయి .రంగడు సోమిశెట్టి దుకాణంలో నుండే   సరకులు  తీసుకొని వెళ్ళేవాడు. కానీ అప్పుడప్పుడు సోమిశెట్టితో  గొడవ పడుతూ ఉండేవాడు.

       ఇది ఇలా ఉండగా ఒకరోజు సోమిశెట్టి  రంగనితో

" డబ్బు చక్కగా కట్టకపోతే  సరకులు ఇవ్వను" అని అన్నాడు. దీంతో మాటా మాటా పెరిగి రంగడు సోమిశెట్టిని " ఏయ్ పిసినారీ! నాకు సరకులు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తావు" అని అన్నాడు. దాంతో సోమిశెట్టి కోపంతో న్యాయాధికారికి రంగడు  తనను పిసినారి అన్నాడని చెప్పాడు .న్యాయాధికారి రంగడిని పిలిపించి  ఆ మాట అన్నందుకు వంద రూపాయల జరిమానాను విధించాడు. రంగడు విధిలేక ఆ జరిమానాను చెల్లించాడు.  అంతేకాదు .సరకుల కొరకై అతడు సోమిశెట్టిని బ్రతిమిలాడవలసి వచ్చింది. అప్పటినుండి రంగడు సోమిశెట్టితో బుద్ధిగా ఉండ సాగాడు .

      ఒకరోజు సోమిశెట్టి రంగడికి సరుకులు ఇస్తూ" నీకు బుద్ధి లేదా! ఏదన్నా పని చేసుకో రాదు "అని అన్నాడు. వెంటనే రంగడు "అదిగో !నన్ను బుద్ధి లేదా అని అంటావా" !అంటూ న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. అతడు సోమిశెట్టిని పిలిపించి  జరిమానా వేసి ఇక ముందు ఎప్పుడూ  "బుద్ధి లేదా" అని అన్నా వంద రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించాడు. సోమిశెట్టి అది తన ఊత పదం  అని తెలిపినా ప్రయోజనం లేకపోయింది. సోమిశెట్టి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది .ఎందుకంటే ఈ ఊత పదం తాను రోజుకు యాభై  సార్లు అంటుంటాడు. మాట మాటకు తనకు ఈ ఊత పదమే వస్తున్నది. తాను ఎంత జాగ్రత్త పడ్డా "బుద్ధి లేదా" అన్నమాట అనకుండా ఉండలేక పోతున్నాడు. అలా సోమిశెట్టి  రంగనికి జరిమానా చెల్లించి తన ఊత పదానికి క్షమించమని వేడుకున్నాడు. కానీ రంగడు ఒప్పుకోలేదు. "ఒక్కసారి పిసినారి అన్నందుకు వంద రూపాయలు  వసూలు చేస్తావా !నీవు "బుద్ధి లేదా "అన్నప్పుడల్లా నాకు జరిమానా కట్టాల్సిందే "అని అన్నాడు .చేసేదిలేక సోమిశెట్టి రంగడికి రోజూ కొంత డబ్బును  జరిమానా క్రింద చెల్లించ సాగాడు .ఊత పదం కారణంగా కొద్ది రోజులకే సోమిశెట్టి బాకీ ముట్టి పోవడమే కాకుండా రంగడికి హాయిగా రోజులు గడవ సాగాయి. అతడు సోమిశెట్టికి డబ్బు కట్టే అవసరం రానేలేదు. పైగా సోమిశెట్టే రంగడికి  బాకీపడవలసి వచ్చింది .ఆ గ్రామంలోని వారు పిసినారికి తగిన శాస్తి రంగడు చేశాడని చెప్పుకోవడం  మొదలుపెట్టారు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం