వృక్షవిలాపం(వచనకవిత):-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 పరోపకారార్థ మిదం శరీరమ్ అని వృక్షాలు
తలెత్తుకొని నిల్చున్నాయి.
తరతరాలుగా తరగని సంపదని‌ మనకు నిర్విరామంగా అందిస్తున్నాయి.
కాసింతచోటు,రవ్వంత ఊతం,
పిసరంత ప్రేమ,చాలినంత నీరు కోరుతున్నాయి.
స్వార్థం లేని జీవనంతో భువిని స్వర్గమే చేస్తున్నాయి చెట్లు
బతికినంతకాలం బరువు కాకుండా,కాలం చెల్లినా,
బ్రతుకుకు ఊపిరిపోస్తున్నాయి.
కన్నతల్లిలా,కల్పవృక్షంలా,
కామధేనువులా,మనం కాటేసినా బ్రతికిస్తున్నాయి.
ఎడారి కాకుండా,నిలువనీడలై
ధరణిని కాపాడుతూ,
పునీతలవుతున్నాయి‌.
ఓ మనిషి మేలుకో!
చెట్ల విలువ తెలుసుకో!
కాలుష్యపుకోరల నుండి నిను రక్షించే వృక్షదేవతలను విరివిగా నాటు!
చేసుకోకు నీకు నీవు చేటు!
విలపింపనీయకు నీ తర్వాతి తరాలను!
ప్రాణవాయువులనిచ్చి,అండగా నీకుండి,నిన్ను ఎల్లప్పటికీ కాపాడే చెట్లు
తమను కాపాడమంటున్నాయి.
అమృతం నీకు ఇస్తామంటున్నాయి.
నీవు విషమే చిమ్మినా,
నిలువునా చీల్చినా,నీకే నా జీవితం అంకితమంటున్నాయి.
షరాబుగా ఖరీదు కడితే
నిన్ను పునాదుల నుండి పెకిలిస్తే
నీ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటున్నాయి.
మానవతనే కోరుకుంటున్నాయి
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం