మూర్ఖులు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554525.

  రామయ్య దగ్గర వెంకటేశం పది వేల రూపాయల అప్పును తీసుకున్నాడు. రామయ్య ఎన్నిసార్లు అడిగినా " అడిగిన తెల్లవారి ఇస్తాను" అని అనడమే తప్ప ఇవ్వడంలేదు .చివరికి రామయ్య గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి వెంకటేశాన్ని  పిలిపించి రామయ్య బాకీ సంగతి అడిగాడు." అడిగిన తెల్లవారి  ఇస్తాను "అన్నాడు వెంకటేశం .ఈ డొంకతిరుగుడు జవాబులు కట్టిపెట్టు. నీవు ఎన్నడూ అడిగినా ఆనాటి తెల్లవారి ఇస్తాననే అర్థం వస్తుందని అందరూ అంటున్నారని రామయ్య చెప్పాడు.  అందువల్ల మరొక వాయిదా పెట్టు" అని అన్నాడు గ్రామాధికారి .
       అప్పుడు వెంకటేశం ఫిబ్రవరి 30వ తేదీ నాడు ఇస్తానని అన్నాడు. రెండో వాయిదా పెట్టినందుకు గ్రామాధికారి సంబరపడ్డాడు. ఆ తర్వాత రామయ్య ఫిబ్రవరి నెలకు 28 లేదా 29వ తేదీలే  ఉంటాయనీ,30వ తేది ఉండదని తెలుసుకుని లబోదిబోమని తిరిగి గ్రామాధికారి దగ్గరకు వెళ్లి  ఈ సంగతిని చెప్పాడు. గ్రామాధికారి తిరిగి వెంకటేశాన్ని  ఆంగ్ల క్యాలెండర్ వద్దని, తెలుగు సంవత్సరాలది మరొక వాయిదా పెట్టమన్నాడు . అప్పుడు వెంకటేశం ఈ 60 సంవత్సరాలు కాకుండా 61వ సంవత్సరం  ఇస్తానని, దాని పేరు తనకు గుర్తుకు రావడం లేదని అన్నాడు. అదికూడా నిజమని నమ్మిన మూర్ఖుడైన గ్రామాధికారి సరేనన్నాడు .
        ఆ తర్వాత రామయ్య తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే అని తెలుసుకొని లబోదిబో మన్నాడు. గ్రామాధికారి కూడా తనలాగే తెలివి తక్కువ వాడు అని తెలుసుకున్న రామయ్య మళ్ళీ గ్రామాధికారి వద్దకు పోలేదు. వెంకటేశం అప్పు తీర్చనే లేదు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం