రాజు కన్నా గొప్పవాడు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

   విజయపురిని ఏలే రాజు విక్రముడు . ఒకరోజు అతడికి ఓ సందేహం కలిగింది. తనకన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? అనేది ఆ సందేహం. ఒక వేళ ఉంటే అతడేవరో   తెలుసుకోవలనే కుతూహలం కలిగింది. వెంటనే సభ ఏర్పాటు చేశాడు. అందరూ సమావేశం అయిన తరువాత  పక్కనే ఉన్న మంత్రితో  తన మనసులో ఉన్న సందేహాన్ని వివరించాడు. . 
  మంత్రి తడుముకోకుండా  "శ్రమజీవి మాత్రమే ప్రభు తమరికన్నా గొప్పవాడు" అన్నాడు.  "అదెలా" అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ. "ఔను రాజా! వాడికి ఏ ఆలోచన ఉండదు. పొద్దునే లేస్తాడు. పనికి వెళతాడు. కండలు కరిగేలా కష్టం చేస్తాడు. పావలా డబ్బులు సంపాయిస్తాడు. వాటితో తినటానికి కావలసిన సరుకులు తెస్తాడు. భార్య పిల్లలతో హాయిగా గడుపుతాడు. సుఖంగా నిద్రపోతాడు. అంతేకాక వాడు చేసే శ్రమవల్లనే మనం ఏ పని చేయకుండానే  నాలుగు మెతుకులు  తినగలుగుతున్నాం. వాడు పనిచేయకుంటే మనం పస్తు పడుకోవాలసిందే.  ఇప్పుడు చెప్పండి. మీ కన్నా గొప్పవాడు శ్రమజీవే కదా?  రాజు చాలా సేపు ఆలోచించాడు.  ఔనని అంగీకరించాడు.
కామెంట్‌లు