రంగరాజపురం పాఠశాలలో కృష్ణశర్మ ,పట్టాభి చదువుకుంటుండేవాళ్లు . ఇద్దరు చదువులో చురుగ్గా వుండడమే కాక కృష్ణశర్మపాటలు,పద్యాలు పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాడి అందరినీ ఆకట్టుకోవడమేకాక ఎన్నో బహుమతులు తెచ్చుకునేవాడు . , అలాగే పట్టాభి పాఠశాల లో పెట్టే వ్యాసాల పోటీలు కానీ , ఏదైనా అంశం ఇచ్చి మాట్లాడమంటే తన వాక్చాతుర్యం తో ఆకట్టుకోవడమే కాక , తనకిచ్చిన అంశం అందరికీ అర్ధమయ్యే టట్లు ఎన్నో విషయాలు చెప్పేవాడు . ఎన్నో బహుమతులు తెచ్చుకునేవాడు .
యిద్దరు మంచి స్నేహితులు గా వుంటూ బాగా చదువుకుని పెద్దై ఇద్దరువాళ్ళ అభిరుచుల మేరకు వేరు వేరు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగ స్థిరపడ్డారు .
తరగతిలో కృష్ణశర్మ పిల్లలకు పాఠాలు చెపుతున్నప్పుడు కొంతమంది సరిగ్గా వినే వాళ్ళు కాదు . మరికొందరు విన్నా అనేక సందేహాలు ,ప్రశ్నలు వాళ్ళకు వచ్చేవి . ఉపాధ్యాయుల గదిలో కృష్ణ శర్మ ఖాళీగా ఉన్న సమయంలో పిల్లలు వెళ్ళి వాటిని నివృత్తి చేసుకుంటుండేవారు . మరికొందరు పాఠాలు గుడ్డిగా కంఠస్తం చేసి పరీక్షలు వ్రాసేవారు . ఈ సమస్య ప్రతిసారి కృష్ణ శర్మకు ఎదురవ్వడంతో ఆలోచనలో పడ్డాడు . దానికి తోడు తోటి ఉపాధ్యాయులు గూడా కృష్ణ శర్మ తో మీరు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుని అన్నిటిలో ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణులైనారు . కానీ మీరు ఖాళీగా వున్నసమయంలో గూడా పిల్లలు ఎన్నో సందేహాలు తీర్చు కోవడానికి మీ వద్దకువస్తున్నారు . దీనికి కారణం ఏమిటి ? అని అడగడం మొదలు పెట్టారు . కృష్ణ శర్మ గూడా నేను అదే ఆలోచి స్తున్నాను అని చెప్పడంతో బడి ఆఖరు గంట మ్రోగడం తో అందరూ వెళ్ళిపోయారు .
కృష్ణ శర్మ బడికి సెలవు పెట్టి తన బంధువుల ఇంట్లో శుభ కార్యానికి పక్క ఊరికి వెళ్ళి వస్తూ దారిలో పట్టాభి ని కలిసి వెళ్లాలని బడిలో అడుగు పెట్టాడు . పట్టాభి తరగతిలో పాఠం చెపుతున్నాడు . పిల్లలు నిశబ్ధం గా, శ్రద్దగా వింటూండడం చూసి పక్కగా నిలబడిపోయాడు . అది గమనిoచని పట్టాభి పిల్లలకు పాఠం చెప్పే టప్పుడు అర్థమవ్వడానికి ఉదాహరణలు , సామెతలు , పొడుపు కథలు లాంటివి ఎన్నో చెప్పడం ,అడిగిన దానికి పిల్లలు సమాధానాలు వెంటనే చెప్పడం గమనించాడు . పిల్లలు శ్రద్దగా పాఠాలు వినాలన్న , అర్థం చేసుకోవాలన్న ఎలాచెప్పాలో అన్న విషయం కృష్ణ శర్మ కు అర్థమైంది . ఇంతలో గంట మోగడంతో పట్టాభి తరగతి బయటికి వచ్చి కృష్ణ శర్మ ను చూసి సంతోషంతో పలకరించాడు. ఇద్దరు మాట్లాడు కుంటూ ఎన్నో విషయాలు పట్టాభి ని అడిగి తెలుసుకున్నాడు .
మర్నాడు తరగతిలో పాఠం చెప్పడంలో ఎంతో మార్పు కనపడడం తో పిల్లలు శ్రద్దగా పాఠాలు వినడం , ప్రశ్నలు , సందేహాలు తీర్చుకోవడం క్రమేణా తగ్గిపోయి పిల్లలందరూ చక్కగా చదవడం మొదలు పెట్టారు . .ఎంతో పాండిత్యం సంపాది౦చినా పిల్లలకు పాఠాలు సరైన పద్దతుల్లో అర్థమయ్యే రీతిలో బోధి౦చడం ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణం అని కృష్ణ శర్మ గ్రహించాడు. .
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి