ఎంగిలికూడు ...!! కవిత ;-డా.కె.ఎల్.వి.ప్రసాద్.>హన్మకొండ .

 పల్లెటూరి పిల్లోడు సైతం 
ఎన్నికలంటే ....
అదోపండుగ అనుకుని
ఎగిరి గంతేస్తున్నాడు...
పెద్దోళ్ళు మాత్రం,
నిజంగానే--
పండగజేసుకున్టున్నారు!
చేసుకోరూమరి....
బీదరికానికి
అందని ద్రాక్షపండు
బిర్యాని
ఇంటికే వస్తున్నది ...
చేతికందిన సొమ్ముతో 
నేలగ్రాసం 
గడిచిపోతున్నది ....!
ఎవడుగెలిస్తే 
వాడికెందుకు ? 
దేశం ఏమైపోతే 
వాడికెందుకు ...?
నడిచినంతకాలం 
నడిపిస్తాడు ....
కష్టమంటే ఏమిటో 
మరిచిపోతాడు ....
నూకలు రాసుంటే 
బ్రతికి బట్టకడతాడు 
లేకుంటే ....
కాలగర్బంలో 
కలిసిపోతాడు .....!
ఆ..ఇంట్లో మాత్రం,
వెన్నెముకలేని-
అమ్ముడుపోయే
ఓటరుమరొకడు
ఎంగిలికూడు కోసం
ఎదురుచూస్తున్టాడు !!
            ***

కామెంట్‌లు