ఎండాకాలం సమస్యలు....;పి . కమలాకర్ రావు
 అతిదాహం....
ఎండాకాలలో  వాతావరణంలో 
వేడి పెరిగినపుడు శరీరంలోని
నీరు అవిరైపోతాయి. అప్పుడు
దాహం బాగావేసి నీరు తాగాలనిపిస్తుంది. ఎంతనీరు త్రాగినాకూడా ఒక్కొక్కసారి
దాహం తీరదు. అలాంటపుడు
ధనియాలను పొడిగా చేసి నీటిలో వేసి మరిగించి చల్లార్చి వడపోసుకొని ఆ నీళ్లను అప్పుడప్పుడు  త్రాగాలి.
అతిదాహం సమస్య తగ్గుతుంది.
ఎండిన ఉసిరికాయ పెచ్చులను
బాగా కడిగి నీళ్ళల్లో నానపెట్టి
ఆ రాసాన్ని త్రాగుతుంటే  అతిదాహ సమస్య తగ్గుతుంది.
ఉసిరికాయల పొడిని కూడా  ఇలాగే నీళ్ళల్లో వేసి త్రాగవచ్చు.
కొన్ని జామ ఆకుల్ని తెచ్చి బాగా
కడిగి,నీళ్ళల్లో వేసి మరిగించి  చల్లార్చిన రాసాన్ని అప్పుడప్పుడు
త్రాగుతుంటే అతి దాహం సమస్య
తగ్గి పోతుంది.

కామెంట్‌లు