*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 120 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య ఆత్మాహుతి - అరుంధతి గా వశిష్ఠునితో వివాహం - బ్రహ్మ శివ కళ్యాణం కొరకు శివదేవిని ఆశ్రయించుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -* 
*నారదా!  శంకరుని ఆజ్ఞను అనుసరించి సంధ్య, మేధాతిథి యజ్ఞము చేస్తున్న, చంద్రభాగ పర్వతం నుండి పుట్టిన చంద్రభాగ నదీ తీరంలో బృహల్లత అనబడే సరస్సు దగ్గర వున్న, ఆశ్రమానికి చేరుకుంది. శివుని అనుగ్రహం వలన సంధ్య అక్కడ వున్న వారెవరికీ కనబడలేదు. హోమ గుండంలో అగ్ని దేవుడు తన పొడవాటి కోరలు చాచి భగ భగ మండుతున్నాడు. ఆ హోమాగ్నిని చూచిన సంధ్య, శివుని ఆజ్ఞ ప్రకారం, తనకు మౌనంగా చేయవలసిన తపస్సు నియమాలు బోధించిన బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతున్న బ్రహ్మచారి అయిన యువకుని తలచుకుని హోమ గుండంలో ఆత్మ సమర్పణ చేస్తుంది. శివుని తలంపు తెలుసుకున్న అగ్ని దేవుడు బంగారు కాంతితో మెరసి పోతున్న సంధ్య శరీరమును దగ్ధము చేసి, పరిశుద్ధముగా చేసి, అగ్ని పునీత అయిన సంధ్యను సూర్యమండలానికి చేరుస్తాడు.*
*ఆ విధంగా, అగ్ని పునీత అయి వచ్చిన సంధ్య ను పితరులు మరియు దేవతల తృప్తి కొరకు ప్రాతః సంధ్య, సాయం సంధ్య అనే రెండు భాగాలుగా చేస్తాడు, సూర్యుడు. సంధ్య శరీరం యొక్క పై భాగం, అరుణారుణ కాంతులతో ఉదయించే సూర్యుని తో కలిసి వచ్చే ప్రాతః సంధ్య. ఇది దేవతలకు చాలా ఇష్టమైన సమయం. ఎర్ర కలువల కాంతితో అస్తమిస్తున్న సూర్యనితో వచ్చేది సాయం సంధ్య. ఈ సమయం పితరులకు ప్రీతి అయినది.*
*ఈ సాయం సంధ్యకు, భక్తవశంకరుడు, దివ్య శరీరము ఇచ్చి, బంగారు కాంతులతో మెరసే దేహధారి అయిన స్త్రీగా చేసి, యజ్ఞము ముగిసే సమయానికి, మహర్షి మేధాతిథికి యజ్ఞ ఫలంగా, కుమార్తె గా ఇస్తాడు. శిష్యులతో చుట్టబడి వున్న మేధాతిథి మహర్షి తన ఒడిలో కూర్చున్న దైవ ప్రసాదాన్ని చూచి చాలా సంతోషపడి, ఆ బంగారు తల్లికి, "అరుంధతి" అని నామకరణం చేసాడు.*
*మహాసాధ్వి, పరమ పవిత్రురాలు అయిన అరుంధతి యుక్తవయసులో కి రావడం చూచిన విష్ణువు, శివుడు, నేను,  నా మానస పుత్రుడైన వశిష్ఠునికి ఇచ్చి వివాహం జరిపించాము. ఈ వివాహ సమయంలో మా ముగ్గురి చేతులనుండి జారిన నీటి ధారలతో "శిప్ర" మొదలగు ఏడు నదులు ఏర్పడ్డాయి. అరుంధతీ వశిష్ఠుల సంసార నౌక ఆనందంగా సాగిపోతోంది. వారికి శుభాన్ని, శ్రేష్ఠతను ఇవ్వగల ఏడుగురు కుమారులు కలిగారు. సంధ్యా దేవి యొక్క ఈ పుణ్య కథను విన్న స్త్రీ, పురుషులు సకలకార్య సిద్ధిని పొందుతారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం