ఊపిరి పీల్చుకున్న జింకలు;-- యామిజాల జగదీశ్
 అదొక అడవి. అక్కడ ఒక తల్లి జింక, దాని పిల్ల ఉన్నాయి. తల్లి జింక ఎక్కడికి వెళ్ళినా తన పిల్లను తీసుకుపోతుంటుంది. 
ఆ అడవికి తరచూ వేటగాళ్ళు వస్తుండేవాళ్ళు. వారు తమతో ఒక వేటకుక్కను తీసుకొస్తుంటారు. వారెక్కువగా కుందేలు‌, జింకలనే వేటాడేవారు. ఎక్కడైనా కుందేలునో జింకలనో చూస్తే వాటిమీదకు తోడేలుని వాటిపైకి ఉసిగొలిపే వారు. 
ఓరోజు తల్లి జింక "ఈ అడవిలో వేటకుక్కల బెడద ఎక్కువ. కనుక నువ్వు జాగర్తగా ఉండాలి" అంది. 
"వేటకుక్కలా? అంటే అదెలా ఉంటుందమ్మా?" అని అడిగింది పిల్ల జింక.
"అబ్బో...అవి చూడ్డానికి అది భీకరంగా ఉంటుంది. భయంపుడుతుంది" అంది తల్లి.
"అవునా? భయమంటే?" అంది పిల్ల జింక.
"నువ్వు పిల్లవు. నీకు భయం గురించి తెలీదులే. మనకు దూరం నుంచి వాటి అరుపులు వినడంతోనే మనం మరొక దిశలో పారిపోవాలి" అంది తల్లి జింక.
"అలాగా...అదేం చేస్తుంది?"
",ఏం చేస్తుందా? మనమీద దాడి చేసి ఇట్టే చంపేస్తాయి. అప్పుడు వేటగాళ్ళు పరుగున వచ్చి మనల్ని తీసుకుపోతారు"అంది తల్లి జింక.
 "అంటే జింకలన్నింటికీ వేటకుక్కలంటే భయమా అమ్మా?" అడిగింది పిల్ల జింక.
"అవును, జింకలన్నింటికీ వేటకుక్కలంటే భయం"
"అదేంటీ మగ జింకలకు కొమ్ములుంటాయిగా...అవెందుకు భయపడాలి? వేటకుక్కలు దగ్గరకు రాగానే కొమ్ములతో వాటిని పొడవచ్చుగా. నికు కొమ్ములు రానీ. వాటి సంగతి చెప్తా" అంది పిల్ల జింక.
ఇలా తల్లీ పిల్లా మాట్లాడుకుంటుంటే దూరం నుంచీ అరుపులు వినిపించాయి.
వెంటనే తల్లి జింక చెవులు నిక్కబొడుచుకున్నాయి. శబ్దం వినవచ్చిన దిశలో చూసింది.
"అయ్యా! వేటకుక్క వస్తున్నట్టుంది. త్వరగా పరిగెత్తు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం" అంది. తల్లి.
కానీ పిల్ల జింక పరుగెత్తలేదు. వేటకుక్క ఎలా ఉంటుందో చూడాలనుకుంది. 
పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. 
కాస్సేపటికి వేటకుక్క అటువైపుగా వచ్చింది.
కానీ దాక్కున్న పిల్ల జింకను చూడలేదు. వేటకుక్క మరో వైపుకి వెళ్ళిపోవడంతో పొదలోంచి జింక పిల్ల బయటకు వచ్చింది.
తల్లిజింక వెతుక్కుంటూ పిల్ల దగ్గరకు చేరింది.
"మంచివేళ..వేటకుక్క కంట పడలేదు నువ్వు. నేను పరుగెత్తగానే నువ్వూ నా వెంట వచ్చేయవలసింది. నువ్వు వెనకే వస్తావనుకునే నేను ముందుకు పరిగెత్తాను. ఇంకెప్పుడూ ఇలా చేయకు. నా వెంటే రావాలి" అంది తల్లి జింక.
"అమ్మా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు.వేటకుక్క నీ అంత ఎత్తుకూడా లేదమ్మా. దానికి కొమ్ములూ లేవు. కనుక అది మనల్నేమీ చేయలేదు. అయినా నాకు కొమ్ములు రానివ్వు. దాని పని పడతాను. ఒక్క పోటు పోడిచానో అది విలవిలలాడాల్సిందే" ఆన్నాది పిల్ల జింక.
అప్పుడు తల్లి జింక ఓ నవ్వు నవ్వి "నువ్వెంతటి ధైర్యవంతుడైనా వేటకుక్క, సింహం, పులి వంటివాటి దగ్గర  తోకముడవాల్సిందే. భయపడాల్సిందే" అంది.
 "ఈ అడవిలో సీంహం కూడా ఉందా? " అని అడిగింది పిల్ల. 
"ఉంది. మనమెప్పుడూ అటువైపు వెళ్ళింది లేదు. మనం పోయే దారిలో అది అంతగా రాదు" అన్నాది తల్లి జింక.
"అయితే దానినీ ఓ రోజు చూసెయ్యాలమ్మా" అంది పిల్ల జింక.
,నీరు తాగి తిరిగొస్తున్నప్పుడు తల్లి జింక నేల మీద చూసింది. "అమ్మో...సింహం ఇటొచ్చినట్టుంది. దాని పాదముద్రలివి" అని భయపడింది. 
"ఏమిటీ, సీంహం పాదముద్రలా? " అడిగింది పిల్ల జింకా ఆత్రుతతో.
"ఇదిగో చూడు. అవి సింహం పాద ముద్రలే. మనమిటువెళ్ళడం ప్రమాదకరం. వచ్చిన దారిలోనే పారిపోదాం. సింహం మనల్ని చూస్తే మన పని అయినట్టే" అంటూ సింహ గల్జన వినిపించిన దిశలో చూసింది తల్లి జింక.
అంతట పిల్ల జింక "నువ్వు కావాలంటే వెళ్ళమ్మా. నేను దానిని చూసాక వస్తానమ్మా" చెప్పింది పిల్ల.
పిల్ల జింక ఇలా అంటున్న సమయంలోనే దూరం నుంచి ఓ అరుపు వినిపించింది. 
“అయ్యో...వేటకుక్కసైతం వస్తోంది. త్వరగా రా!" అంటూ తల్లి జింక పరుగులు తీసింది.
కానీ పిల్ల జింక పరుగెత్తలేదు. దగ్గర్లోనే ఉన్న పొదలోకి దూరింది. వేటకుక్క ఎటొస్తోందో అటువైపు చూసింది.
పొద దగ్గరకొచ్చి ఆగి చుట్టూ చూసింది వేటకుక్క. 
సరిగ్గా అదే సమయంలో అడవి దద్దరిల్లేటట్టు సింహగర్జన వినిపించింది.
ఆ గర్జన ధ్వనికి వేటకుక్క ఓ చెట్టు చాటున దాక్కుంది. కాస్సేపటికి సింహం వచ్చిఉది.
పొద మాటున దాక్కున్న పిల్ల జింక సింహంకేసి చూసింది. 
"ఛ...ఈ సింహానికా మా అమ్మ భయపడుతోంది. ఇదేం చేస్తుంది? దీనికీ కొమ్ములు లేవుగా. ఇది అమ్మంత ఎత్తుకూడా లేదు. అరుపులే తప్ప దీనికేమీ లేదు" అనుకుంది పిల్లజింక. 
సింహం చెట్టుచాటున దాక్కున్న వేటకుక్కను చూసేసింది. వేటకుక్కంటే సింహానికి చెడ్డకోపం. "ఈ ఈ వేటకుక్కవల్లే అడవోలో కుందేళ్ళు, జింకల సంఖ్య తగ్గిపోతున్నాయి.దీనిని వజలకూడదు" అనుకుంది సింహం.
సింహం అమాంతం వేటకుక్కమీద దిడి చేసింది. అది పారిపోయే మార్గంలేక పోరాడాల్సి వచ్చింది. ఆ రెండింటి మధ్య జరిగిన యుద్ధాని చూసి వణికింది పిల్ల జింక.
భయంతో అక్కడ్నుంచి పరుగులు తీసింది పిల్లజింక. 
అమ్మను చూసాకే పిల్ల జింక పరుగు ఆగింది.
తన పిల్లను చూసిన క్షణంలోనే అమ్మ మనసు శాంతించింది. రెండూ కలిసి అక్కడి నుంచి చల్లగా జారుకుని తమ స్థావరానికి చేరుకోవడంతో ఆరోజు కథ ముగిసింది.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం