మినీలు - యామిజాల జగదీశ్
 1
అవసరం
..............
ఓ ఆవు గడ్డి మేస్తోంది.
అక్కడే చెట్టుపైన ఉన్న పిల్ల పిచ్చుక తల్లిని అడిగింది...
"అమ్మా, ఎందుకమ్మా, ఆవుకి మనలాగా రెక్కలు లేవు" అని.
అప్పుడు తల్లి పిచ్చుక నవ్వుతూ మనలాగా ఆవుకి రెక్కల అవసరం లేదంది.
తల్లి పిచ్చుక ఇంకా ఇలా అంది...
"ఆకాశంలో గడ్డి మొలిచినప్పుడు ఆవుకి రెక్కలు మొలుస్తాయి" అని.
2
జగన్నాథుడు
.............
కుచేలుడు తన భార్యను పిలిచాడు
"సుశీ...నేను కృష్ణుడి ఇంటికి పోతున్నాను ఓసారి చూసొద్దామని. ఏమిస్తావు?" అని అడిగాడు.
"స్వామీ, మీకు తెలియకుండా నా దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి. పొరుగింట్లో నించి తీసుకొచ్చిన ఓ పిడికెడు అటుకులు ఉన్నాయి" అంది కుచేలుడి భార్య.
"అటుకులా....అతనికివి చాలా ఇష్టం. అది చాల్లే. ఇవ్వు" అన్నాడు కుచేలుడు.
"స్వామీ, పిల్లలు ఆకలితో గోలపెడుతున్నారు. కృష్ణుడు మీ మిత్రుడే కదా. మీరీ గుప్పెడూ తీసుకుపోవాల్సిందేనా" అడిగింది అతని భార్య.
"ఓసీ పిచ్చిదానా. కృష్ణుడు నా మిత్రుడు మాత్రమే కాదు, ఓ గొప్ప అధికారి. అతను జగన్నాథుడనే విషయాన్ని మరచిపోయేవా" అన్నాడు కుచేలుడు.
3
వేణువు
..................
అడవిలో ఉన్న వెదురుచెట్టు ఓ రోజు నరికివేతకు గురైంది. 
ఓ నిప్పు కమ్మీతో తనను పొడుస్తుంటే "అయ్యో నా దేహం పుండవుతోంది" అని ఏడ్చింది వెదురు.
"కాస్తంత ఓపిక పట్టు" అంది వెదురుని చూసి గాలి.
వెదురుబొంగు వేణువైంది,
వేదికపై...
ప్రపంచాన్ని తన్మయపరిచే వేణుగాన సంగీత ప్రవాహం సాగుతుంటే ప్రేక్షకులందరూ ఆనందపరవశులయ్యారు. 
అప్పుడు వేణువుని చూసి గాలి చెప్పింది...
"గాయపడిన మనసే ఓలలాడించగలదు" అని.

4
విలువ
-----------
బతికితే కోకిలలా బతకాలి అన్నాది సీతాకోకచిలుక.
ఇంకొక సీతాకోకచిలుక అడిగింది
"ఎందుకు" అని.
"అదిగో చూడు...మామిడిచెట్టుకొమ్మపైన పాడుతోంది కోకిల"
"అది మామిడి చెట్టుకోసమే పాడుతోంది. అనంతరం మామిడిపండుని తింటుంది. ఎగిరిపోతుంది" 
"అర్థం కాలేదా"
"ఎవరికీ బాకీ ఉండకూడదు. ఇచ్చి పుచ్చుకో. అంతేతప్ప ఒకరికి భారమై బతక్కూడదు"
"ఓహో...ఇప్పుడు అర్థమైంది" అంది రెండో సీతాకోకచిలుక.
తనతో తాను చెప్పుకుంది...
"చెట్టుకో పాట.
కోకిలకో పండు..."

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం