భక్తి-శ్రద్ధ! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా రోజూ  అమ్మ తో పాటు సాయిబాబా గుడి వీలుంటే శివాలయంకి వెళ్లి వస్తుంటాడు.అమ్మ తో పాటు ప్రదక్షిణాలు నుదుట విభూది పెట్టుకొని తీర్ధం ప్రసాదం తీసుకుని ఇంటికి వస్తాడు.బడి హడావిడి ఉన్న రోజు  పరీక్షలటైంలో వెళ్లడు.అమ్మ పిలిచినా "నేను చదువుకోవాలి.మాటీచరు చెప్పారు గాలిలో దీపంపెట్టి దేవుడూ నీమహిమ అనరాదు అని.బాగా చదివితే పరీక్షల టెన్షన్ పోగొట్టి అన్నీ గుర్తు కు వచ్చేలా చేస్తాడు ట."తల్లి చేసేదేమీ లేక ఒక్కతే వెళ్తుంది. సెలవు  ప్రత్యేక పూజలు జరగటంతో గుడిలో భజనలు  సత్సంగం అన్నీ జరుగుతున్నాయి. శివా అక్కడ అందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. కొందరు సెల్ ఫోన్ లో మాట్లాడుతుంటే ఇంకొందరు పిచ్చాపాటి వెనకాల కూచుని గుసగులాడుతున్నారు.అంతా ఐనాక రెండు పెద్ద స్టీలు డబ్బాల నిండా పులిహోర  చక్కెరపొంగలి పెట్టుకొని తల్లి బైలుదేరింది.శివా నడుస్తూ అడిగాడు "అమ్మా!గుడిలో శ్రద్ధ సబూరీ అని చెప్పారు కదా!మరి భక్తి కన్నా కబుర్లు జోరుగా చెప్పుకుంటున్నారు కొందరు ఆంటీలు!కొందరు అన్నలు అంకుల్స్ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. మాటీచర్లు పాఠం చెప్పేటప్పుడు తమకళ్లలోకి చూస్తూ వినమంటారు.మధ్యలో ఠక్కున ప్రశ్నలు వేస్తూ జవాబు చెప్పకపోతే నిలబెడతారు.దేవుడు కూడా చూస్తాడు అని చెప్పావుకదా?"
"అబ్బబ్బ!నీవెధవప్రశ్నలు నీవు!?పెద్ద వారి విషయాలు నీకెందుకురా?" ఇంతలో  వృద్ధ దివ్యాంగులు దీనంగా అమ్మా అని పిలుస్తున్నారు. "గబగబా నడవరా శివా!" తల్లి హడావుడిగా అడుగులేస్తోంది."అమ్మా!బాబా రోజూ భిక్షాటన కెళ్ళి  ఆవచ్చిన దానితో వండి బీదబిక్కీకి పంచేవాడు అని చెప్పావు.పాపం  ఆదివ్యాంగులకి పెట్టమ్మా!" వాడిగొంతులో వేడికోలు!అక్కడ అంతా కార్లలో పట్టుచీరల రెపరెపలతో ఉన్న వారే పళ్లాలు పట్టుకుని క్యూలో నిలబడ్డారు."మన అపార్ట్మెంట్ వారికీ పంచాలి కదా?"తల్లి జవాబు వాడికి తృప్తి గా లేదు. అందుకే "నేను నీతో రాను.ఆదివ్యాంగులకి ప్రసాదం కడుపు నిండేలా పెట్టు"అని రెండు పేపర్ ప్లేట్లు అమ్మ ముందు పెట్టాడు. ఇకచేసేదేమీ లేక అమ్మ అలాగే వారికి శివా చేత ప్రసాదం పంపింది."సల్లంగ ఉండు బిడ్డా!" వారి మాటలు అమ్మ మనసుకి తాకాయి.పెద్దలు నీతులు చెప్తూ అడ్డదారుల్లో పోతున్నారు. పిల్లలు ఇంకా మంచి దారిలో అడుగులేస్తూ ఉన్నారు. భక్తి-శ్రద్ధ తో పాటు ఆచరణలో ఆదర్శంగా ఉండాలి -అనుకుంటూ శివా వైపు గర్వంగా చూసింది.తన కొడుకు తనకు మార్గదర్శి ఐనందుకు ఆమె లో ఎంతో మార్పు చోటుచేసుకుంది. 🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం