అదృష్టం-దురదృష్టం;-: సి.హెచ్.ప్రతాప్
 రెండు కుక్కలు ఒక రోజు కలిసి ఆహారం వేటలో పడ్డాయి. రోడ్డు మీద నడుస్తూ కనిపించిన చెత్త కుండీలలో ఏదైనా ఆహారం దొరికితే వాటితో కడుపు నింపుకుంటూ నడుస్తున్నాయి.
ఇంతలో రోడ్డు పక్కన ఒక చిన్న కోడి పిల్ల కనిపించింది. అది బహుశా తన తల్లి నుండి నుండి విడిపోయి ఉంటుంది. ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంగా చూస్తూ వుంది.
దానిని చూడగానే మొదటి కుక్క  " ఆహా!ఈ రోజుకు విందు భోజనం దొరికింది, ఏమి నా అదృష్టం" అంటూ ఆనందంతో మొరిగి ఆ కోడిపిల్లను గబుక్కున నోట కరుచుకొని పరుగులు తీసింది. దాని వెనకాలే రెండో కుక్క కూడా ఆశగా పరుగులు తీసింది.
ఒక ఖాళీ ప్రదేశంలో రెండు కుక్కలు ఆగాయి. "ఇప్పుడు ప్రశాంతంగా ఈ కోడి పిల్లను తిని నా కడుపు నింపుకుంటాను" అంది మొదటి కుక్క.
" నేనూ నీతోపాటే ఆకలితో వున్నాను.నాకు కొంచెం భాగం ఇవ్వవా" ప్రాధేయ పడింది రెండో కుక్క.
"అదెలా కుదురుతుంది. దానిని మొదట చూసింది నేను. కష్టపడి పట్టుకుంది నేను. కాబట్టి మొత్తం నాకే చెందాలి. ఇందులో నీకు భాగం ఇచ్చే ప్రసక్తి లేదు" ఖచ్చితంగా అంది మొదటి కుక్క. అంతేకాకుండా ఎంతో ఆబగా ఆ కోడిపిల్ల మాంసాన్ని పీక్కు తినడం ప్రారంభించింది.
ఇంతలో " పాడు కుక్కలు ఇక్కడే వున్నాయి. పట్టుకొని చంపండి" అంటూ అరుపులు వినిపించగా రెండు కుక్కలు వెనక్కి తిరిగి చేసాయి.
 
కొందరు మనుష్యులు కర్రలు, కట్టెలు చేత్తో పట్టుకొని  కోపంగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు.
" మనల్ని చూస్తే వాళ్ళు చంపేస్తారు.త్వరగా పరిగెత్తు" అంది మొదటి కుక్క.
" కోడిపిల్లను పట్టుకుంది నువ్వు, తింటోంది నువ్వు, కాబట్టి శిక్ష కూడా నువ్వే అనుభవించు. అదృష్టంలో పాలు పంచుకోనప్పుడు దురదృష్టంలో నేను ఎందుకు తోడు రావాలి?"  అని రెండో కుక్క అక్కడినుండి పారిపోయింది.
మొదటి కుక్క పరిగెత్తే లోపల ఆ మనుష్యులు కర్రలతో కుక్కను చావబాదారు.



సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం