ప్రగతి పిల్లలం జగతి మల్లెలం;-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
వస్త్రాలు నేసేటి పిల్లలం
శాస్త్రాలు చూసేటి మల్లెలం
పరిశోధన చేస్తున్నావారలం
పరివేదన మస్తున్నపోరలం. !

మేం చేనేత శిక్షణ తీసుకున్నం
మా రాత రక్షణ తెలుసుకున్నం   
అందుకే గురువును చేరుకున్నం
విందు జ్ఞానఫలముల కోరుకున్నం

శాస్త్రముల గురించి  గురువును
అడిగి దించుకుంటాం బరువును
పరిశోధన పత్రాలు వారికి ఇస్తాం
శోధించిన సత్యాలను వివరిస్తాం!

ముందుమాట వ్రాయిస్తాం గురువుచే
ప్రతి నోటా చదివిస్తాం దరువుచే
మమ్ము అంతా మెచ్చుకొని గౌరవిస్తారు
గమ్మున వారంతా మాకు సహకరిస్తారు !

అచ్చు వేసి పుస్తకాలు రెడీగా వుంచుతాం
మచ్చుకు కొన్నింటిని సభలో
 పంచుతాం
పుస్తకావిష్కరణ సభను జరిపిస్తాం
పుస్తక ప్రియులను మేం మురిపిస్తాం!

కవుల కళాకారుల ఆహ్వానిస్తాం
కవికోకిల బిరుదిచ్చి సన్మానిస్తాం
ఆవిష్కరణ దృశ్యాలను చిత్రీకరిస్తాం
పునఃస్మరణ అంశాలను సూత్రీకరిస్తాం !

ఇలా మా సాహిత్య సేవను చేస్తూ
చాలా గౌరవ మర్యాదలు మోస్తూ
సభలు సమావేశాలు నిర్వహిస్తూ
చేస్తాం మాసాహిత్య పొలాల కాస్తూ

సభా మర్యాదలను పాటిస్తూ
సభికుల మదినే దోచేస్తూ
కార్యక్రమాలను నిర్వహిస్తాం
కలుపుకొని అందరిచే పర్వం చేస్తాం

మా చేనేత వస్త్రాలను అందిస్తూ
 నాయకుల మాటలకు స్పందిస్తూ
నిర్వహిస్తాం ఓ విజ్ఞాన సదస్సు
స్పందించేలా మా జనం మేదస్సు!

శాస్త్రీయ దృక్పథం దాహం తీర్చుకుంటాం
ఆ వస్త్ర కలంకారీనీ మేం నేర్చుకుంటాం
ప్రభుత్వ పారితోషకం అందుకుంటాం
ప్రగతి పథంలో మేమే ఇక ముందుంటాం !


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం