'పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి'



 ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని కాల్వశ్రీరాంపూర్ ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య కోరారు. బుధవారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో రెండవ విడత ఎఫ్ఎల్ఎన్ (తొలి మెట్టు) ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల్లో కనీస సామర్థ్యాలు, పాఠ్యాంశమాధారిత అభ్యసన ఫలితాల సాధన కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన శాస్త్రీయ విద్యా విధానం అమలు చేస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. కోర్స్ కోఆర్డినేటర్ యర్రా రమేష్, పరిశీలకులు సుదర్శనం, కూకట్ల తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, అదంతా ప్రజల సొమ్ము అనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశేష బోధనా అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రైవేట్ మోజులో పడి తమ కష్టార్జిత సొమ్మును వృధా చేసుకోకూడదని వారు పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం డీఆర్పీ ఈర్ల సమ్మయ్య 1నుండి 5తరగతుల తెలుగు భాషా సామర్ధ్యాల సాధన, వార్షిక, వారాంతపు, పీరియడ్ ప్రణాళికలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీలు ఈర్ల సమ్మయ్య, కె. స్వప్న, గుంటి వేణుగోపాల్, కె. దేవేందర్, సీఆర్పీ కుంట కుమార స్వామి, మండలంలోని ఉపాధ్యాయుని,  ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం