దివ్యధామం;--నెల్లుట్ల సునీత(శ్రీరామ)ఖమ్మం7989460657
మహాభారత యుద్ధం 
అనంతరం
ద్వాపర యుగంలో
 పరశురాముడు
 ప్రతిష్టించిన పంచలింగాలు

సూర్య భగవానుడు 
క్షేత్రపాలకుడై
వెలసిన దివ్యధామం
నాగావళి స్వర్ణముఖి 
వేదవతి సంఘమించే 
పవిత్ర  క్షేత్రం

 ప్రజల కష్టాలు చూసి 
చలించిన పరశురాముడు
గంగను నాగలితో
 బంధించి
తెచ్చిన వైనం

పాప ప్రక్షాళనకు 
నాగావళి నదీ జలం
సంగమ స్థానంలో స్నానమాచరించిన
  ఎంతో పుణ్యఫలం

శివరాత్రి పర్వదినాన
 సంగమేశ్వరునికి
           బ్రహ్మాండమైన   ఉత్సవం. 
            నేత్రానందమై

ఉమా రుద్ర కోటేశ్వరునిగా
మణి నాగేశ్వరుని స్వామిగా
భక్తులకు దర్శనం
శివుడు స్వయంభుడై
కొలువైన
సంగమేశ్వర ఆలయం
చారిత్రాత్మక కట్టడమై
 విరాజిల్లుతూ.


కామెంట్‌లు