వింజమూరి శివరామారావు గారు రాసిన హంసభిక్షకులు నాటకంలో నేను నండూరి సుబ్బారావు గారు, సి.రామ మోహన్ రావు గారు ఎం నాగరత్నమ్మ గారు, ఎన్.సి.వి జగన్నాథాచారులు గారు పాల్గొన్నాం. దాని నిర్వహణ బందా గారే. బందాగారికి మొదటి నుంచి పౌరాణికలు అంటే చాలా ఇష్టం. నేమాని వెంకట కోటేశ్వర శర్మ గారితో సంప్రదించి వ్యాసభారత ఆధారంగా లక్క ఇల్లు గంట నాటకాన్ని రాయించారు దానిలో నేను వేమూరి శ్రీధర్ రావు బందా గారు లాంటి దిగ్గజాలు పాల్గొన్నాము. శ్రీధర్ రావు రేడియో లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు రంగస్థలం మీద భీముని పాత్రకు ఆయనే తగినవాడు పౌరాణిక ఏక పాత్రలను వినిపించేవారు ఇందులో బందాగారు కృష్ణ పాత్ర పద్యాలు పాడడం ఆయన రంగస్థలం మీద ఎలా ప్రదర్శించే వారు ప్రత్యక్షంగా మేము చూశాం.పౌరాణికాలలో ఎంత గొప్పగా రాణించారో సాంఘీకాలలో కూడా అంత మంచి పేరు తెచ్చుకున్న వారు బందా. ఏడిద కామేశ్వరావు గారు రాసిన లక్షలు, కోట్లు హాస్య నాటకాన్ని నండూరి సుబ్బారావు గారు నాగరత్నమ్మ గారు మధుసూదన్ రావు గారు కందుకూరి రామభద్ర రావు గారితో పాటు నేను జగన్నాథ ఆచార్యులు గారు కూడా నటించాం. దానిలో రెండు వాక్యములు పాత్ర బందా గారిది గంగాధర్ రావు గారు వైద్యుడుగా ఎంతమందికి స్వస్థత ఇచ్చారో వారి ప్రహసనాల ద్వారా, నాటికల ద్వారా సమాజంలో అంత సంచలనాన్ని సృష్టించారు. రేడియోకు ప్రత్యేకంగా ఆయన వ్రాసిన ప్రజాయుద్ధం నాటకంలో బందా గారితో కలిసి నేను సి రామ్ మోహన్ రావు, సుబ్బారావు గారు పాల్గొన్నాం. బందాగారు వారు నిర్వహించే నాటకాలలోనే కాక మిగిలిన వారు ఎవరు పిలిచినా వెళ్లి తను కూడా నటించేవారు. రాహుల్ కృత్యాయన్ తో పరిచయం ఉన్నవారు బుచ్చిబాబు గారు. వారి మస్తిష్కంలో మెరిసిన అద్భుతమైన మెరుపు గాజు మేడ షేక్స్పియర్ ఐన్స్టీన్ లాంటి ప్రఖ్యాత రచయితలు కవులు ఒకచోట గూడితే ఎలా ఉంటుంది అన్నది కథ. కథ అద్భుతం. అందులో నేను షేక్స్పియర్ కందుకూరి రామభద్ర రావు గారు ఐన్స్టీన్ బందా నండూరి సుబ్బారావు సి. రామ్మోహన్ రావు నండూరి పెట్టారు కె.వి.ఎస్ కుటుంబరావు గారలు మిగిలిన పాత్ర దారులు వింజమూరు శివరామారావు గారు రాసిన నాటకం రామరాజు.సి రామ్మోహన్ రావు మిగిలిన నిలయ విద్వాంసులతో చేశాం దానిలో బంధా గారి పాత్ర కూడా ఉంది.
పద్మ శ్రీ బందా (15);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి