ఉత్తమ రైతు- శ్రీ కోటిరెడ్డి (27);- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించి  అన్ని విషయాలు తెలిసిన చంగల్ రెడ్డి గారు కోటిరెడ్డికి చాలా సన్నిహిత స్నేహితుడు  అయ్యారు  ఏ సందేహాలు వచ్చినా  వారి సలహాలు తీసుకోవడం పరిపాటి వారు నెల్లూరు వచ్చినప్పుడు ఆదిత్య గారు వారి ఆదిత్య కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ జరగవలసిన అతిథి మర్యాదలు  అన్ని ఆయనే చూసుకునేవాడు  కోటిరెడ్డి కాంగ్రెస్  ఆయన నుంచి  దానితో చాలా కార్యక్రమాలు అక్కడే చేయడం అలవాటైపోయింది.కోటిరెడ్డి బృందానికి జంతర్మంతర్లో (ఢిల్లీ) రైతుల నిరసన కార్యక్రమం జరిగినప్పుడు  స్వచ్ఛందంగా ఆయనే  వచ్చి అక్కడికి వెళ్లిన రైతులను ఉత్సాహపరిచిన వ్యక్తి చెంగల్ రెడ్డి గారు  ఏ కార్యక్రమం జరిగినా ఆహ్వానిస్తే నెల్లూరు వచ్చేవారు చంగల్ రెడ్డి గారు అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం ఆయనది.
నాదెండ్ల మనోహర్ గారు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా గుంటూరులో ఘన సన్మానం జరిగింది  నన్ను కూడా  ఆ కార్యక్రమానికి పిలిచి వక్తగా నాలుగు మాటలు చెప్పమన్నారు  మనోహర్ గారు మంచి ఉత్సాహవంతుడు భాస్కర రావు గారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కనక రాజకీయాలలో ఆరితేరిన వాడు  శాసనసభలో ఉన్న  ప్రతి ఒక్కరి మనస్తత్వం వీరికి తెలుసు కనుక ఎవరిని ఎలా అదుపు చేయాలో  ఎవరిని ఎలా హద్దులో ఉంచాలో బాగా తెలిసినవాడు  అంటూ ప్రారంభించి వారిని గురించి మాట్లాడాను  ప్రేక్షకులతో పాటు ఆయన కూడా అభినందనలు తెలియజేశారు. ఐదు ఆరు నెలలు గడిచిన తర్వాత విజయవాడలో వేరే కార్యక్రమానికి వచ్చినప్పుడు  మనోహర్ గారిని కలవడానికి వెళ్లాను మర్యాదపూర్వకంగా  నన్ను గుర్తుపట్టి ఆరోజు నా సన్మాన సభలో మీరు చెప్పిన మాటలను మర్చిపోలేను అన్నారు. శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా చక్కగా మాట్లాడారు అన్నారు  ఎంత జ్ఞాపకశక్తి  ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా భాస్కరరావు గారిని ఎన్నుకున్నారు. వారి కుమార రత్నం మనోహర్  వారి మాటకు ఇరు వైపుల ప్రజలను ఆకర్షిస్తుందని వారిని నెల్లూరు విడిపించి కోటిరెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేసి  ఇక్కడ రైతుల పరిస్థితి గురించి  కోటిరెడ్డి వివరంగా చెప్పారు  ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ  తగిన పరిష్కార మార్గాలను వెతుకుదాం అన్నారు  అలాంటి వాడిని కూడా పిలిచి ఇక్కడ రైతులకు అభిరుచి నేర్పించడం కోటిరెడ్డి ఉద్దేశం  రైతులకు ఉత్తేజాన్ని కలిగించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవసరమైనవని భావించి  తనకు బాగా ఇష్టమైన గురజాడ వారి కన్యాశుల్కం నాటకం మొత్తాన్ని ప్రదర్శిస్తున్న వారు చాలా తక్కువ  విజయనగరంలో జాలరిగా ప్రసిద్ధి చెందినవారు జె.వి  సోమయాజులు రమణమూర్తి బృందానికి తొమ్మిది గంటల నాటకం ఆడించారు.

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం