జంధ్య ధారణ;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ముందార్థ ముండ గోష్పాదములు భారతీయతా చిహ్నములు. ముండ (బోడి గుండు) విద్యార్థులకు, అర్థ గుండు ప్రచారకునికి, ఆవు పాదమంత  పిలక ఉపాధ్యాయ వృత్తికి  గుర్తులు అని శాస్త్రం చెప్తోంది. అలాగే జంధ్యము  ఏం చెప్తుంది  బ్రహ్మ క్షత్రియ వైశ్య  మూడు వర్ణాల వారు  ధరిస్తారు కదా  దాని భేదం ఎవరికైనా అర్థమవుతుందా? వారు పుట్టుకతో జంధ్యాన్ని ధరించి పుడుతున్నారా ఈ ప్రపంచంలో. పోనీ ఆ బిడ్డను కన్న తల్లి కైనా జంధ్యం ఉన్నదా?  అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు.  మరి దీని వల్ల ప్రయోజనం ఏమిటి  ఎందుకు ధరిస్తున్నారు  నిజానికి  బ్రాహ్మణులలో చిన్నప్పుడు ధరించే  దారపు పోగులు వేరు తరవాత ధరించేవి వేరువేరుగా ఉంటాయి ఎందుకు అలా ఉంటాయో ఆ ఏర్పాట్లు ఎందుకు జరిగాయో మనకు ఎవరికీ తెలియదు.
పోనీ మరణించేటప్పుడు  ఆ జంధ్యం తోనే స్మశానంలో అతని శరీరాన్ని కాల్చి  వేస్తారా  శరీరం మీద నూలు పోగు ఉండడానికి కూడా వీలులేని సంప్రదాయం కదా హిందువులది అని వేమన ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి మీదకు బిడ్డ వచ్చిన  క్షణాన  దిగంబరంగా వస్తాడు  మరణించి మరో లోకానికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే దిగంబరంగానే వెళ్ళిపోతాడు  ఈ ప్రపంచానికి తాను తీసుకొచ్చినది గాని ఈ ప్రపంచం నుంచి తాను తీసుకు వెళ్ళేది కానీ  ఏమీ లేదు  అన్న నగ్న సత్యాన్ని చెప్పడం కోసమే  హిందువుల సంప్రదాయాలు  ఏర్పడ్డాయని పెద్దలు చెప్తారు. జననానికి మరణానికి మధ్య మానవుడు చేసే విన్యాసాలు ఇవన్నీ  ఎందుకు బట్టలను ధరిస్తున్నాడు  మానాని కప్పుకోవడానికి సిగ్గు లేకుండా ఉండడానికి  అలాగే జంధ్యానికి కూడా పరమార్థం ఉండాలి కదా  అదేమిటంటే.
అక్షరాభ్యాసానికి తండ్రి బిడ్డను సిద్ధం చేసినప్పుడు  ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ముండనం చేసి  దారపు పోగు  వేసి గురువుకు అప్పచెబుతాడు  వేద శాస్త్ర విజ్ఞానమంతా  జరిగిన తర్వాత  జంధ్య ధారణ విధానం  మారుతుంది  ప్రచారకునిగా  తన బాధ్యత పూర్తయి ఉద్యోగ పర్వం లోకి వచ్చినప్పుడు  మళ్లీ మారుతుంది  వేద జ్ఞానం జీవితంలో అనుసంధానం చేసి  యజ్ఞ యాగాదులను  నిర్వహించే  అధికారం వచ్చిన తరువాత  పూర్తి  జంధ్య ధారణ జరుగుతుంది  ఒకప్పుడు స్త్రీలు  కూడా గార్గి మైత్రేయ లాంటి వాళ్లు కూడా  యజ్ఞ యాగాలు చేశారు  అది ధరించడం వల్ల వారికి ఆ అధికారం ఉన్నది అని భారతీయులకు గుర్తుగా  ఏర్పాటుచేసిన సంకేతం  దానివల్ల వారి హోదా  మనకు తెలుస్తుంది.  వేమన రాసిన వారి ఆటవెలది చదివితే  మనకు అర్థమవుతుంది చదవండి.

"జనన కాలమందు జంధ్యపు త్రాళ్లేవి  
తనకు లేవు తన జననికిని లేవు నడుమ 
జంధ్యమేయ నగుబాటు కాదొకో..."



కామెంట్‌లు