కవితాశీర్షిక :- * పరమార్ధం *
 ఎవరెందుకు పుడతారో..., 
               ఎవరికి తెలుసు !?
  పుట్టి...సుఖ,భోగాలనుభవిం చేది కొందరు... !
  దుఃఖ బాధల్నిభరిస్తూ...బ్రతికే వారింకొందరు... !!

చరిత్రకారులెవరౌతారో...చరిత్ర 
హీనులుగా...,ఎవరుతయారౌ
తారో... !
    ఎవరు,ఏమౌతారో...అగమ్య
గోచరం ! ఊహాతీతం... !!

ఉన్నత శిఖరాలనధిరోహించి... 
   పేరు, ప్రఖ్యాతులు పొందేవా రెవరో...,
     నీచ కార్యాలతో నేరస్తులై... 
 శిక్షల ననుభవించేవారెవరో !!

"ఎవరి కర్మ కెవరు కర్తలు "  అనే ది మా బామ్మ... !
  చేసుకున్నవారికిచేసుకున్నంత 
మహాదేవ అంటుండేవాడు మా తాత.. !!
    "వీళ్లది అర్ధం - పర్ధం లేని కర్మ సిద్ధాంతం!వీళ్లంతా సెంటిమెంట ల్ ఫూల్స్... !"
    అనేవాడు... మా వీధి చివరి హేతువాది !!
 ఆమాటలేవీఅప్పట్లోనాకుబోధ 
బోధపడేవి కావు .... !
    గానీ,ఇప్పుడాలోచిస్తుంటే..., 
నాకైతే...ఆ యా మాటలకు  ఖచ్చితమైన అవగాహన  కలి గింది... !

 హేతువాదమంటే,ఖచ్చితమైన
కార్య,కారణ సంబంధాలే  కదా!
    జరుగుతున్నకార్యానికి...కార ణమేదోఉండే ఉంటుందిఅనేగా 
     
ఆ కారణాన్ని  ఇంకెవరిమీదికో  నెట్టేయటం అన్యాయం కదూ!
 కర్మసిద్ధాంతమంటే...,నా కర్మ అనుకునిచేతులుకట్టుకుకూచో 
మనా... !?  కాదుకదా !

 మనంచేసుకున్నపాపపుణ్యాలే 
మన మనుభవిస్తున్నకష్ట,సుఖా
లు, అనే సత్యాన్ని గ్రహించి...,  
   అవి అనుభవించక తప్పదని 
ఇట్టి కష్టాలికముందుఅనుభవిం చకుండా...ఇప్పుడు,చెడుజోలికిపోక మంచిపనులు మాత్రమే  చేసి... భవిష్యత్తులో... 
  కష్ట,బాధలనుండి తప్పుకునే గట్టి ప్రయత్నాన్ని బోధించేదేనో య్  కర్మసిద్ధాంత మంటే.... !

      ఇంతకన్నా... కార్య, కారణ 
సంబంధ హేతువాదమింకేముం టుంది...!? 
   జన్మకు అర్ధాన్ని, పరమార్ధాన్ని
ఈ ప్రపంచానికి తెలియజెప్పిన జగద్గురువు మన  భారత జనని... !జయహో భారత్ !!
     *******

కామెంట్‌లు