'సొంత ఊరు' ను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు శ్రీ మాధవ్ కౌశిక్ ఆదివారం గోవాలో ఆవిష్కరించారు. గోవాలో జరిగిన సాహిత్య అకాడమీ సమావేశంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి సాహిత్య అకాడమీ ఉపాధ్య క్షురాలు ఆచార్య కుముద్ శర్మ అధ్యక్షత వహించారు. మనిషి లోపల,అక్షరాల చెలిమె తర్వాత వెలువడుతున్న స్వీయ కవితాసంకలనం 'సొంతఊరు' అని కార్యక్రమాన్ని నిర్వహించిన అకాడెమీ కార్యదర్శి డాక్టర్ కే.శ్రీనివాసరావు అన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం శ్రీ మాధవ్ కౌశిక్ మాట్లాడుతూ వారాల ఆనంద్ ఒక చేత పెన్ను మరో చేత కెమెరా పట్టుకున్న సృజన శీలి అన్నారు.ఉత్తమ సాహిత్యం, సమాంతర సినిమా పైన ఆయన రాసిన పుస్తకాల వివరాలు చూస్తే చాలా సంతోషం కలిగిందన్నారు. ఆనంద్ ఎంతో అభినందనీయమయిన కృషి చేశారన్నారు.ఈ ఏటి అనువాద పురస్కారం అందుకున్నందుకు అభినందిస్తున్నానన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుముద్ శర్మ మాట్లాడుతూ అనువాదకుల సమావేశంలో వారాల ఆనంద్ స్పూర్తి దాయకమయిన జీవితం సాహిత్యం అర్థమైందన్నారు. చివరన కవి వారాల ఆనంద్ మాట్లాడుతూ2018 నుండి 2020 వరకు తాను రాసిన కవితల్లోంచి ఎంపికచేసిన కవితల సంకలనం ఈ సొంత ఊరు అన్నారు. దాదాపు మాయమయి పోతున్న ఊరు నేపథ్యంలో రాసిన కవిత్వమిది అన్నారు. దేశం నలుమూలల్నించి రచయితలు అనువాదకులు పాల్గొన్నారు.
*†*†***†**
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి