అంతర్జాతీయ మానవహక్కుల సంస్థచే 'ప్రసాద్'కు ఆత్మీయ సత్కారం

  భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారి 132 వ జయంతి ని పురస్కరించుకుని  కేంద్రప్రభుత్వం  పరిధిలోని అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి మరియు  వే ఫౌండేషన్ జాతీయ సేవా సంస్థ  తిరుపతి  వారి ఆధ్వర్యంలో  హైదరాబాద్  లోని తెలంగాణ సాహిత్య పరిషత్ సభా ప్రాంగణంలో జరిగిన   జాతీయ కవి సమ్మేళనం లో సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయనశాస్త్ర విశ్రాంతశాఖాధిపతి విశాఖపట్నం  అంబేద్కర్ పై వ్రాసిన కవితను ప్రసంశిస్తు  వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య, కవి, రచయిత్రి డాక్టర్ రాధకుసుమ, ప్రముఖ జానపద విప్లవ గాయని స్వర్ణక్క,అంతర్జాతీయ మానవ హక్కుల రాష్ట్ర సభ్యులు డాక్టర్ అనిల్  రాజు మరియు వరలక్ష్మి ప్రసాద్.మాస్టర్ ని  ఘనంగా అభినందన ప్రశంసా పత్రం, శాలువ చక్కటి  జ్ఞాపికతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు.ప్రసాద్ మాస్టర్ బదులుగా మహనీయులు రాజ్యాంగ శిల్పి అంబేద్కర్  కవితకు  సాహితీ ద్రష్టలు డాక్టర్ దేవులపల్లి రామనుజరావు గారు,జ్ఞానపీఠ గ్రహీత ఆచార్య సి.నారాయణ రెడ్డి సహాయ సహకరాలతో నిర్మించిన  సరస్వతీ మాత నిలయమైన ఈ సభా ప్రాంగణంలో  అంతర్జాతీయ సంస్థ చే సత్కారం లభించటం నేను జీవితాన మరువలేనిది అని చెప్పారు. సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులు ప్రసాద్ మాస్టర్ కి అభినందనలు తెలియచేసారు.
కామెంట్‌లు