వేయి వరహల మూట.;- డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

 భువనగిరిని పాలించే గుణశేఖరుడు తనమంత్రి సుబుధ్ధితోకలసి మారువేషాలలో ఆఊరి సంతలో పాల్గోన్నాడు. ఆచుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా  సంతలోతమకు కావలసిన వస్తువులు కేనుగోలుచేస్తున్నారు.
అప్పటివరకు ఆసంతలో యాచన చేస్తున్న వృధ్ధుడు,అక్కడ తమ వలలోచిక్కిన పలురకాల పక్షులను పంజరాలలోపెట్టి అమ్ముతున్న వారివద్దకు వెళ్ళి వారితో మాట్లాడి వారుఅడిగిన ధరచెల్లించిన అనంతరం వారివద్ద బందీగాఉన్న పక్షులను పంజరాలనుండి విడుదల చేయసాగాడు.
అప్పటివరకు అతనిచర్యలను గమనిస్తూ అతనికి చేరువగా ఉన్న రాజు గుణశేఖరుడు ఆశ్చర్యపోయాడు. యాచనచేసే వృధ్ధుడు మరికొంత ముందుకు వెళ్ళి బంధించబడిన కుందేళ్ళు అమ్ముతున్న వారితో మాట్లాడాడు.ఆయాచక వృధ్ధుడు మరికొందరినియాచిస్తూ మారువేషం లోని రాజుగారి వద్దకువచ్చి 'అయ్యా ఒకరూక దానంచేయండి' అనిచేయి చాపాడు. తనరొంటిలో నుండి ఒకవరహ తీసి ఇచ్చాడు మంత్రి.
'ధర్మప్రభువులు చల్లగాఉండాలి'అని దీవించి వెళ్ళిన వృధ్ధుడు,కుందేళ్ళు అమ్మేవారు అడిగినంత ధర చెల్లించి వారిని తనవెంటపెట్టుకువళ్ళి చేరువలోని అడవిలో వాటిని వదిలివేయమన్నాడు. ఇదంతాగమనించిన గుణశేఖరుడు "మంత్రివర్యా యాచకునిలో ఇంతటి దయార్ధతహ్రుదయం ఉండటం చాలా గొప్పవిషయంకదా "అన్నాడు "ప్రభు మనశరీరంపై ధరించేనగలు కృత్రిమమైనవి. కాని మనిషికి పుట్టుకతోనే బంగారం,వజ్ర వైఢూర్యాలకన్నా విలువైన ప్రేమ,జాలి,దయ,కరణ,పరోపకారంవంటి అత్యంత విలువైనసులక్షణాలతో జన్మిస్తాడు. పుట్టుకతో తమకు లభించిన ఆవెలలేని ఆభరణిల విలువ తెలుసుకున్నవారు జీవితంలో ఉన్నతులుగా సాటివారికి సహయపడుతూ జీవించి,చరిత్రలోమహోన్నతులుగా  మిగిలిపోతారు. ఆవృధ్ధుడు కనుమరుగు కాకముందే అతన్ని కలుద్దాం" అంటూ వడివడిగా అడుగులువేస్తూ ,అతనివద్దకు చేరినమంత్రి "తాతా యాచనలో వచ్చినదంతా పక్షులకు,కుందేళ్ళవిడుదలకు ఇచ్చివేసావే, రేపటి నీ ఆకలి ఎలాతీర్చుకుంటావు" అన్నాడు మంత్రి సుబుధ్ధి. "నాయనా దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ.. ‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు. దానంచేసే అంతటి ధనవంతుడను నేనుకాను కనుక నావద్ద యాచనతోవచ్చిన ధనతో వారం వారం ఈసంతలో ఆమూగజీవాలకు విముక్తి కలిగిస్తున్నాను.ప్రతిదినం యాచనతో జీవించేనాకు ఏదైనా దేవాలయంలో అంతప్రసాదమో! లేదంటే ఏదయామయురాలైన తల్లి పట్టెడు అన్నంపెడుతుంది.నాకు రేపటి చింతనలేదు. మనంచేసే మంచి పనిలో కలిగే ఆనందం ముందు మరేదిసాటిరాదు. ప్రతి పండుకు ఓరుచి ఉన్నట్లే ప్రతి మంచి కార్యానికి ఓగోప్ప అనుభూతిఉంటుంది ఆనందం అనుభవించితీరాలేకాని మాటలతో వర్ణించలేము" అన్నాడు ఆవృధ్ధ యాచకుడు."నిజమే తాత నీవుచెప్పినమాట వేయివరహల మూట "
తనవద్దఉన్న వేయి వరహలమూట వృధ్ధుని చేతికి అందించిన మహరాజు, తనమంత్రితోకలసి రాజధానికి బయలు దేరాడు.
.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం