రాజేశ్వరరావు చండ్ర .(1915-1994);- తాటి కోల పద్మావతి

 అవిశ్రాంత విప్లవ యోధుడైన రాజేశ్వరరావు ని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సి ఆర్ గా పిలుచుకుంటారు. ఈయన కృష్ణాజిల్లా మంగళాపురంలో 1915లో కలవారి కుటుంబంలో జన్మించాడు. బందరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివి తర్వాత ఎంబిబిఎస్ రెండేళ్లు చదివి కమ్యూనిస్టు భావాలకు లోనై చదువు నుంచి మార్క్ స్ట్ సిద్ధాంతాలు అధ్యయనం కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆచార్య నరేంద్ర డేల్ సన్నిధిలో మార్కిస్ట్ తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసి 1942లో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు. వీరు తెలంగాణ సాయుధ పోరాటంలో సుందరయ్య గారితో కలిసి పని చేశారు. కమ్యూనిస్టు పార్టీ 1964 లో రెండుగా చీలినప్పుడు సిపిఐ కార్యదర్శిగా 1989 వరకు పాతిక సంవత్సరాలు పనిచేశారు. చల్లపల్లి జమీందారీ భూములను రైతుల పరం చేయడంతో విశాలాంధ్ర నిర్మాణంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణంలో వీరుని వలే కృషి చేశారు. వీరి నిరంతర సేవలకు గుర్తింపుగా సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ లెనిన్ గౌరవంతో సత్కరించింది. భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో గొప్ప స్థానం సంపాదించిన వీరు 1994లో పరమపదించారు. వీరి అభిమానాలు అనుచరులు వీరి మరణానంతరం సి ఆర్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ అనే సంస్థను హైదరాబాదు కేంద్రంగా స్థాపించారు.
.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం