సద్వినియోగం చెయ్యాలి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇవాళ సమాజంలో మనం రకరకాల వ్యక్తులను  వారు చేసే కార్యక్రమాలను గమనించినట్లయితే  ఆ గ్రామానికి గాని పట్టణానికి గాని కావలసిన పనిని  రోడ్డు వెయ్యడానికి గుడి కట్టడానికి విద్యాలయాన్ని స్థాపించడానికి అన్న వంక పెట్టి  దానికి కావలసిన  వనరుల కోసం  అక్కడ ఉన్న ధనవంతుల వద్దకు వెళ్లి విషయాన్ని సక్రమంగా చెప్పి  దానికోసం సహకరించమని  దానం చేసి పుణ్యం కట్టుకోమని  వారి వద్ద వసూలు చేస్తారు  అలా వసూలు చేసిన ధనంతో  ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత  దానికి కావలసిన  అవసరాల కోసం  మరి కొంతమంది సహకారం తీసుకొని  వారి వద్ద మరి కొంత ధనాన్ని సేకరించి  ఆలయానికి కావలసిన అన్ని  అలంకారాలతో పాటు కార్యక్రమాలు పూర్తి చేస్తారు
ఇవాళ సమాజంలో దానిని వ్యాపారాత్మకంగా  మలచి  ఆ కార్యక్రమాల పేరుతో ధనాన్ని  సేకరించడం  దానిని  సొంత పనులకు ఉపయోగించుకోవడం  తన అప్పులను తీర్చుకోవడానికి కానీ స్థలాలు కొనుక్కోడానికి కానీ  తన గృహానికి కావలసిన అవసరాలను తీర్చుకోవడానికి కానీ  ఉపయోగిస్తూ ఉన్నటువంటి వాళ్లను  చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం  కానీ వారిని ఏమీ అనడానికి  ఎందుకు ఈ తప్పు చేస్తున్నావ్ అని నిలదీయడానికి  ఎలాంటి ఆధారాలు మనకు కనిపించవు  అలా మసి పూసి మారేడు కాయ చేసే వ్యక్తులను మనం  చూసి మనసులోనే వీడు ఇంత నీచ బుజ్జి కలిగిన వాడా అనుకొని  ఇలాంటి వెదవలు వల్లనే సమాజం నాశనం అయిపోతుందని ఎవరికి వారు లోలోపలే అనుకుంటారు కానీ  బయటపడరు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని వేమన  ఒక చక్కటి సూచన  ఆట వేలాది పద్యంలో మనకు తెలియజేశారు  ఇతరులు చేసిన దానధర్మాలను  సద్వినియోగం చేసి ఏఏ కార్యక్రమాల కోసం వారు నిధులను పోగు చేశారు  ఆ పనిని చేసిన వారు  మంచి మనసుతో  మంచి కార్యాన్ని చేసిన ప్రతి ఒక్కరికి  తమ సొంత ఆస్తి దానంతట అదే పెరుగుతుంది కానీ  అదే వృధా చేస్తూ  వంద రూపాయలు ఖర్చు చేసి వెయ్యి రూపాయలు  గా చూపే రాతలతో  మోసం చేసే వారి జీవితంలో కష్టపడి సంపాదించుకున్న తన సొంత ఆస్తి కూడా  ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం నాశనం అయిపోతుంది  కనుక ఎలాంటి మోసాలకు పాల్పడవద్దు అని నీతిని చెప్పడం కోసం ఈ పద్యాన్ని మనకు అందించారు మీరూ చదవండి.

"పరుల దత్తమునకు పాలన జేసిన నిల స్వదత్తమునకు నినుమడించు  నవని పరుల దత్తమపహరించిన స్వదత్తంబు నిష్ఫలంబు ధరణి వేమ..."



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం