న్యాయాలు -168
భూమి రథిక న్యాయము
******
భూమి అంటే,పృథివి,మట్టి, ప్రదేశము, చోటు, స్థితి పుడమి,అవని,నేల,ధరణి, ధరిత్రి మొదలైన అర్థాలు కలవు.
రథిక అంటే రథమెక్కి పోవు వాడు, రథము పై నుండి యుద్ధము చేయువాడు అనే అర్థాలు కలవు.
రథము పై నుండి యుద్ధము చేయుట నేర్పే ఆచార్యుడు లేదా గురువు తన శిష్యులకు మొదట నేలపై ఓ రథం బొమ్మ గీస్తాడు. ఆ గీతలలో శిష్యుని నిల్చోబెట్టి నేర్పుతాడు.అలా శిష్యుడు రథములో నుండి యుద్ధము చేయుచున్నట్లు భావిస్తూ నేర్చుకుంటాడు.ఆ తర్వాత యుద్ధరంగములలో మహా రథికుడై విజయం సాధించే నైపుణ్యాన్ని పొందుతాడు.
ఇలా గురువు కనుసన్నల్లో రథ యుద్ధం ఊహిస్తూ నేర్చుకోవడాన్ని భూమి రథిక న్యాయము అంటారు .
ఏ విద్య అయినా సరే నేర్చుకోవడానికి గురువు అవసరమనీ,గురువు నేర్పాల్సిన విషయానికి సంబంధించి ఎలాంటి బోధనా వ్యూహాన్ని అమలు పరుస్తాడో, బోధనాభ్యసన సన్నివేశాన్ని కల్పిస్తూ విద్యార్థులకు అవగాహన చేస్తాడో ఈ న్యాయము ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యను అభ్యసించడానికి గురువు ఎంత ముఖ్యమో రాసిన ప్రజాకవి వేమన గారి పద్యాలను చూద్దాం.
"గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో /అజునికైన వాని యబ్బకైన/తాళపు చెవి లేక తలుపెట్లూడునో?/ విశ్వధాభిరామ వినురవేమ!"
తాళము చెవి లేకుండా తలుపు తాళం ఏ విధంగా రాదో అదే విధంగా గురువు శిక్షణ లేకుండా బ్రహ్మ కానీ అతని తండ్రి కానీ జ్ఞానాన్ని పొందలేరు" అంటారు.
అలాగే మరో పద్యం
"వాక్కు నందు గురువు వాక్రుతాను గురువు/చీకటి నటు గురుడు చిక్కి యుండు/ అఖిలమునకు గురువు యాధారమై యుండు/ విశ్వధాభిరామ వినురవేమ!"
మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి ఉంది. మాటల శక్తిలో గురువు యొక్క ప్రభావం ఉంది.మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టు కోవడానికి ఆధారభూతమైన వాడు గురువే. ఈ లోకంలో ఏ పని నేర్చుకోవాలి అనుకున్నా గురువు తప్పకుండా ఉండాలి. గురువు లేనిది ఏ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అంత తొందరగా దరి చేరవు. సంపూర్ణమైన అవగాహన కలుగదు. అందుకే ఏది నేర్చుకోవాలనుకున్నా గురువే ఆధారం.
భూమి రథిక న్యాయము ద్వారా మనం ఉత్తమమైన గురువు ఏ విధంగా విజ్ఞానం,విషయ పరిజ్ఞానం విద్యార్థుల్లో నింపుతాడో తెలుసుకున్నాం. అంతే కాదు నైతిక విలువలను పాటించేలా చేసేది కూడా గురువేనని అర్థం చేసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
భూమి రథిక న్యాయము
******
భూమి అంటే,పృథివి,మట్టి, ప్రదేశము, చోటు, స్థితి పుడమి,అవని,నేల,ధరణి, ధరిత్రి మొదలైన అర్థాలు కలవు.
రథిక అంటే రథమెక్కి పోవు వాడు, రథము పై నుండి యుద్ధము చేయువాడు అనే అర్థాలు కలవు.
రథము పై నుండి యుద్ధము చేయుట నేర్పే ఆచార్యుడు లేదా గురువు తన శిష్యులకు మొదట నేలపై ఓ రథం బొమ్మ గీస్తాడు. ఆ గీతలలో శిష్యుని నిల్చోబెట్టి నేర్పుతాడు.అలా శిష్యుడు రథములో నుండి యుద్ధము చేయుచున్నట్లు భావిస్తూ నేర్చుకుంటాడు.ఆ తర్వాత యుద్ధరంగములలో మహా రథికుడై విజయం సాధించే నైపుణ్యాన్ని పొందుతాడు.
ఇలా గురువు కనుసన్నల్లో రథ యుద్ధం ఊహిస్తూ నేర్చుకోవడాన్ని భూమి రథిక న్యాయము అంటారు .
ఏ విద్య అయినా సరే నేర్చుకోవడానికి గురువు అవసరమనీ,గురువు నేర్పాల్సిన విషయానికి సంబంధించి ఎలాంటి బోధనా వ్యూహాన్ని అమలు పరుస్తాడో, బోధనాభ్యసన సన్నివేశాన్ని కల్పిస్తూ విద్యార్థులకు అవగాహన చేస్తాడో ఈ న్యాయము ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యను అభ్యసించడానికి గురువు ఎంత ముఖ్యమో రాసిన ప్రజాకవి వేమన గారి పద్యాలను చూద్దాం.
"గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో /అజునికైన వాని యబ్బకైన/తాళపు చెవి లేక తలుపెట్లూడునో?/ విశ్వధాభిరామ వినురవేమ!"
తాళము చెవి లేకుండా తలుపు తాళం ఏ విధంగా రాదో అదే విధంగా గురువు శిక్షణ లేకుండా బ్రహ్మ కానీ అతని తండ్రి కానీ జ్ఞానాన్ని పొందలేరు" అంటారు.
అలాగే మరో పద్యం
"వాక్కు నందు గురువు వాక్రుతాను గురువు/చీకటి నటు గురుడు చిక్కి యుండు/ అఖిలమునకు గురువు యాధారమై యుండు/ విశ్వధాభిరామ వినురవేమ!"
మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి ఉంది. మాటల శక్తిలో గురువు యొక్క ప్రభావం ఉంది.మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టు కోవడానికి ఆధారభూతమైన వాడు గురువే. ఈ లోకంలో ఏ పని నేర్చుకోవాలి అనుకున్నా గురువు తప్పకుండా ఉండాలి. గురువు లేనిది ఏ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అంత తొందరగా దరి చేరవు. సంపూర్ణమైన అవగాహన కలుగదు. అందుకే ఏది నేర్చుకోవాలనుకున్నా గురువే ఆధారం.
భూమి రథిక న్యాయము ద్వారా మనం ఉత్తమమైన గురువు ఏ విధంగా విజ్ఞానం,విషయ పరిజ్ఞానం విద్యార్థుల్లో నింపుతాడో తెలుసుకున్నాం. అంతే కాదు నైతిక విలువలను పాటించేలా చేసేది కూడా గురువేనని అర్థం చేసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి