సేంద్రీయ వ్యవసాయం ప్రాశస్త్యం; - :సి.హెచ్.సాయిప్రతాప్
 సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణింపవచ్చు. సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను మరియు నేలలో గల సూక్ష్మ జీవుల పనితనాన్ని వృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని విస్మరిస్తూ, సేద్య, జీవ సంబంధ మరియు యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది . నేలపై లేదా భూమిపై పైరు వ్యర్ధపదార్ధాలను కప్పడం వలన నేలను సూర్యరశ్మి , గాలి మరియు వర్షపు నీటి కోత నుండి ఎటువంటి ఆర్ధిక నష్టం లేకుండా, మట్టిని ఎంత మాత్రం నష్టపోకుండా సంరక్షింప వచ్చును. తద్వారా మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
గత ముప్ఫై సంవత్సరాలలో పురుగు మందుల వాడకం, రసాయనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. అధిక దిగుబడి, అధిక లాభాల పేరుతో వీటిని విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు.. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా.. ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోవదం లేదు. వీటి వాడకం వల్ల ఎన్నిసత్పలితాలు వచ్చాయో.. అంతకు మించి దుష్పలితాలను చవి చూసారు. చూస్తూనే ఉన్నారు. మనం తాగే నీరు, పీల్చే గాలి, తినే తిండి, పండే పంట పూర్తిగా కలుషిత మయమయ్యాయి. నిత్యం అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నాము.
సేంద్రీయ వ్యవసాయం, ప్రామాణిక వ్యవసాయంతో పోల్చినప్పుడు, చిన్న పురుగుమందులను తీసుకుంటుంది, నేల కోతను తగ్గిస్తుంది, నైట్రేట్ లీచేట్‌ను ఉపరితలం మరియు భూగర్భ జలాల్లోకి తగ్గిస్తుంది మరియు జంతువుల ఎరువును తిరిగి పొలంలోకి రీసైకిల్ చేస్తుంది. ఈ ప్రయోజనాలు అధిక వినియోగదారు ఆహార ఖర్చులు మరియు మొత్తం తక్కువ దిగుబడితో భర్తీ చేయబడతాయి.
ముఖ్యంగా భూసారాన్ని పెంచే వానపాములు పూర్తిగా అంతరించి పోయే స్టేజిలో ఉన్నాయి. తేనె టీగలు కూడా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే దిశగా సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ నిపుణులు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం