'పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి'; -కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్


 ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య, సకల సౌకర్యాలతో పాటు విశేష అనుభవం కలిగిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేయబడుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ అధ్యక్షుడు నూనేటి సంపత్ కుమార్ యాదవ్ కోరారు. మంగళవారం ఉదయం ఆయన మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 15 లక్షల విలువైన ఫర్నిచర్, పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాఠశాల పిల్లలకు ఉచిత యూనిఫాం, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. 'మన ఊరు మనబడి పథకం' కింద తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తయారుచేసి, సకల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. కార్పొరేట్ పాఠశాలల కంటే గొప్పగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయని, తల్లిదండ్రులు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకుండా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎంపీపీ కోరారు. అనంతరం వైస్ ఎంపీపీ జూకంటి శిరీష అనిల్ మాట్లాడుతూ... పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకొని పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా పిల్లల్ని  అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఒత్తిడి లేని, స్వేచ్ఛపూరిత వాతావరణంలో విద్యాబోధన జరుగుతోందని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లని చేర్పించాలని ఆమె కోరారు.  దీనికంటే ముందు ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు గ్రామవీధుల్లో ఊరేగుతూ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను గురించి నినాదాలు చేశారు. తర్వాత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి, పాఠశాల నాడు, నేడు స్థితిగతులను వివరించారు. పాఠశాలలో జాతీయ జెండాను ఎగరవేసి పిల్లలకు మిఠాయిలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, ఉపసర్పంచ్ సుధాటి కరుణాకర్రావు, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీఓ గోవర్ధన్, ఏఈ జగదీశ్వర్, ప్రధానోపాధ్యాయులు వై. రమేష్, ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, గ్రామ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం