వందేమాతరం! అచ్యుతుని రాజ్యశ్రీ

 తాత అడిగాడు "వందేమాతరం రాసినది ఎవరు?""ఓహ్! అదికూడా తెలియదా తాతా? బంకించంద్ ఛటర్జీ "."మరి వందేమాతరం ని ఇంటిపేరు గా మార్చుకున్న దేశభక్తుడెవరు? ఆయన మన తెలంగాణా వాడే!" పిల్లలంతా బిక్కమొహం వేసి "తెలీదు తాతా!ఆయన్ని గూర్చి చెప్పవు?" అని ముద్దు గా  అడిగారు."ఆ! ఆయన గద్వాల దగ్గర ఉన్న క్యాటూర్ అనే పల్లెలో 1917లో పుట్టారు. నిజాం పాలనలో హైదరాబాద్ మగ్గుతున్న రోజులవి. 1938 లో ఆబిడ్స్ సెంటర్ లో కొందరు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అంతేవారిని చంచల్ గూడ జైల్లో పడేశారు. వావిలాల రామచంద్రరావు అనే విద్యార్థి ని గన్ గురిపెట్టి పోలీసులు బెదిరించారు " నీవు ఆపాట పాడితే చంపేస్తాం" అతను ఏమాత్రం బెదరలేదు.  అంతే24లాఠీ దెబ్బలు శిక్ష పడింది. అతని దుస్తులు విప్పి ఓపీటమీద నిలబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు.   లాఠీతో దావూద్ అనేవాడు కొట్టాడు.మొదటి దెబ్బకు రామచంద్రరావు  బెదరక "వందేమాతరం " అన్నాడు. అంతే రక్తం కారేలా ఆదుష్టుడు 24సార్లు  చావచితకబాదినా ఆయన ఆపలేదు.ఈయనతోపాటు లాఠీ దెబ్బలు తిన్న వారు రాంలాల్ మోతీలాల్ చనిపోయారు.ఆసాహసి వావిలాల రామచంద్రరావు జైలు నించి విడుదల ఐనాక సావర్కార్ ఆయన్ని వందేమాతరం రామచంద్రరావు అని పిలవటం తో ఆపేరు స్థిరపడింది. హైదరాబాద్ నవాబు స్వతంత్ర రాజ్యంగా ఉంటానని భీష్మించాడు.అంతే సర్దార్ పటేల్ కె.ఎం.మున్షీకి నిజాం కీలక సమాచారం అందించారు ఈయన. అలా నిజాం ఆటకట్టించటంలో కీలకపాత్ర పోషించారు వందేమాతరం రామచంద్రరావు గారు. శాసనసభ కి ఎన్నికై అప్పటి ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు గా పనిచేసి న ఆయన 2001లో అమరులైనారు.ఇలాంటి మహానుభావులగూర్చి అందరూ తెలుసు కోవాలి "." నిజం తాతా! మాకు ఇప్పుడే తెల్సిందే ఆయన గొప్ప తనం" అంటూ వందేమాతరం రామచంద్రరావు తాత గారి కి జేజేలు అని అరవసాగారు🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం