'కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలి';- - ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య


 సమాజంలో పేద, ధనిక అనే భేదం లేకుండా అన్ని కులాలు, మతాలు, వర్గాల వారు ఒకే దగ్గర కలిసి చదువుకునే 'కామన్ స్కూల్ విద్యా విధానాన్ని' అమలు చేయాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సమాజంలో సమానత్వ భావనను  పెంపొందిస్తుందన్నారు. సోమవారం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా కాల్వశ్రీరాంపూర్ గ్రామంలో ఉపాధ్యాయినులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, సౌకర్యాలు, ప్రత్యేకతల గురించి ఆయన పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలను పొందాలని ఆయన పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... విద్య, వైద్యం ప్రైవేటుపరం కాకూడదని, అది భవిష్యత్ తరాలకు అంత క్షేమకరంకాదన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన, శాస్త్రీయ విద్యతో పాటు డిజిటల్ పరికరాలతో సాంకేతిక విద్యా బోధన అందుబాటులోకి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, పిల్లల తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, దీనివల్ల పిల్లల్లో మానసిక, శారీరక వికాసంతో పాటు ఎలాంటి ఒత్తిడి, సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందుతుందన్నారు. అందుకే తన ఇద్దరు పిల్లల్ని పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం