జన్మ భూమి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చదువుతున్న వాళ్లను చూసి మరి కొంతమంది అక్షరాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది సఫలీకృతులు అవుతారు  అసలు ఆంధ్ర భాషలో ఉన్న గొప్పతనం  ఒక అక్షరాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చితే  దాని అర్థం పూర్తిగా మారిపోతుంది  ఏ వాక్యాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపి చదివితే తప్ప దాని పూర్తి అర్థం రాసే వారికి గాని వినేవారికి కానీ తెలియదు  శతశ్లోకేన పండితః అన్నది  ఒకనానూడి  100 శ్లోకాలు వస్తే చాలు వాడు పండితుడైపోతాడు అని  అదే భాష తెలిసినవాడు  శతశ్లోకే అన్నంత వరకు చదివి కొంచెం ఆపి న పండితః అని అంటే దాని అర్థం ఏమయిపోతుంది  100 శ్లోకాలు చదివినంత మాత్రాన పండితుడవు కాదురా అని ఎద్దేవా చేయడానికి పనికి వస్తుంది.
అలాగే  ఒకే అక్షరాన్ని వేరువేరుగా వ్రాయడం వల్ల వచ్చే ఇబ్బంది  ర అన్న అక్షరాన్ని తీసుకుంటే  శకటరిఫం బండిర సాధు రేపం  మామూలు ర  నీరు అని శబ్దాన్ని తీసుకున్నట్లయితే  శకటరిఫములో నీరు అని వ్రాస్తే  జలము అన్న అర్థం మనకు తెలుస్తుంది  కొంతమంది పండితులు  సనాతన ధర్మం తెలిసిన వారు  నీరు  అని శకటరిఫం రాస్తే  దాని అర్థం ఏమిటి  ఇది ఆలోచించకుండా పెద్ద పండితుడు కూడా చూడండి ఎంత తప్పు రాసాడో అని వారిని వేలెత్తి చూపిస్తాం  అది జలం కాదురా  నుసి  బూడిద అన్న అర్థం రా అని చెప్పిన వాడి బుర్రకు అది అర్ధం కాదు  అలా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు  హస్తిమసికాంతరమంత భేదం  మనకు కని

పిస్తూ ఉంటుంది. ఆ పదాలను అనుభవించడంలో కూడా మనకు కనిపిస్తుంది.
ఎవరి భాష వారికి ఎంతో ప్రధానమైనది. ఎవరి తల్లి వారికి దేవతగా వారికి కనిపిస్తుంది. అలాగే జన్మ  భూమి  ఆరోజు వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని సంహరించిన తరువాత  నిజానికి ఆ  లంక రాముల వారి స్వాధీనం అయినట్టే లెక్క  అక్కడ వారు సింహాసనాన్ని అధిస్టించి ఆ రాజ్యాన్ని పరిపాలించవచ్చు  కానీ రాముని తో అద్భుతమైన వాక్యం చెప్పించారు వాల్మీకి మహర్షి లేకుంటే ఆయన మామూలు కవులు లాగా రచయితల లాగానే మిగిలిపోయేవారు  మహర్షి అని ఆయనకు తెలియకుండానే ఆయనకు మనం బిరుదును ఇచ్చి అలా స్మరించుకుంటున్నాం  ఒక భారతీయుడే కాదు ప్రపంచంలో వాల్మీకాన్ని చదివిన ప్రతి ఒక్కరికి ఈ విషయం  అనుభవంలోకి వచ్చింది.

కామెంట్‌లు