దేశమును ప్రేమించు మన్నా.. మంచి అన్నది పెంచుమన్నా …..
వట్టి మాటలు కట్టి పెట్ట వోయ్….గట్టి మేల్ తలపెట్టవోయ్…..
అని ఎలిగెత్తి చాటిన అభ్యుదయ కవి, సంఘ సంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు గారు విశాఖపట్నం వద్ద ఏస్. రాయవరం లో జన్మించారు.
ఆయన వ్రాసిన ‘కన్యా శుల్కం’ నాటకం సుప్రసిద్ధం. కన్యా శుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యం లో మృచ్చకటికం తప్ప మరొకటి లేదు అని శ్రీ శ్రీ గారు అన్నారంటే గురజాడ వారి రచన వైశిష్ట్యం ఎలాంటిదో తెలుస్తుంది. పుత్తడి బొమ్మా పూర్ణమ్మా .. అనే గేయం కూడా చాలా సుప్రసిద్ధమైనది.
గురజాడ పెక్కు రచనలు చేశారు. తమ రచనలు వ్యావహారిక భాషలో నే చేశారు. వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ మూర్తి గారు గురజాడ వారి ప్రాణ స్నేహితుడు.
నేడు శ్రీ గురజాడ అప్పారావు గారి జయంతి
శ్రీ గురజాడ అప్పారావు గారు (1862 – 1915);- సేకరణ తాయారు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి