కంబదహాళ్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు



పెద్దకడబూర్ మండల పరిధిలోని కంబదహాళ్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.బాలబంధు,గణితోపాధ్యాయులు గద్వాల సోమన్న మరియు తెలుగు భాషోపాధ్యాయులు కేశవయ్య గారల ఆధ్వర్యంలో ,విద్యార్థుల సమక్షంలో, ఉపాధ్యాయులంతా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్  గారి చిత్ర పటానికి పూలమాల వేసి,శుభాకాంక్షలు తెలిపారు.గద్వాల సోమన్న, కేశవయ్య గారులు మాట్లాడుతూ భారతరత్న, తొలి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తిలో  చేసిన సేవలు,కృషిని విద్యార్థులకు తెలియజేశారు.అనంతరం అంతర్జాతీయ గురజాడ సేవా రత్న అవార్డు-2023కు ఎంపికైన బాలబంధు గద్వాల సోమన్నను,ఉపాధ్యాయులను మరియు ఆయాలను సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మావతి, మాబు,నిర్మలరాణి,లక్ష్మీ,అనిత ,రంగన్న ,సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు