సమాజంలో మనుషులు రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటాడు సత్య పాలనతోనే జీవితాన్ని కొనసాగించాలని ఎలాంటి తప్పులు చేయకుండా పవిత్రంగా జీవితాన్ని కొనసాగించాలని కొందరు భావిస్తూ ఉంటారు భావనలోనే కాక చేతలలో కూడా దానిని అనుసరించి చూయిస్తారు కొంతమందికికల్లబొల్లి కబుర్లు చెప్పడం ప్రతి విషయాన్ని వింతగా వర్ణించడం విపరీతమైన అతిశయోక్తులతో కథలాగా అతని మనసును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనృతాన్ని నమ్మినంత వేదికగా నిజాన్ని ఎవరూ నమ్మరు కూడా వేమన లాంటివాడువేద విదులు కూడా వీరిని నీచులుగా అభి వర్ణిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అతని మనసుకు పొగడ్తల లాగానే కనిపిస్తాయి.మన కావ్యాలలో కూడా అనేక కథలు సత్య సంధులను గురించి కావ్యాలు కూడా రాశారు ప్రత్యేకించి హరిశ్చంద్రుని కథ మనం తీసుకున్నట్లయితే ఆడిన మాట తప్పకుండా మాట నిలపెట్టుకోవడానికి తన జీవితమంతా కష్టాలను అనుభవించిన కథ మన హృదయాలను కలచి వేస్తుంది నిక్కమైన నిజాన్ని చెప్పగలిగిన ప్రతి వ్యక్తి ఇలాంటి కష్టాలు అనుభవించక తప్పదు అని చెప్పడమే ఆ కథ పరమార్థం రెండవది ఎన్ని కష్ట నష్టములు వచ్చిన దానిని ఓర్చుకొని సత్యము చెప్పడం మానరాదు అన్న నీతిని ప్రబోధించడం కూడా మనం గమనించవచ్చు ఏ రచన కైనా లేదా కవిత కైనా చివరకు వేదం చెప్పిన మంచిని ప్రచారం చేయడానికి వ్రాస్తాడు తప్ప చెడు మార్గాన్ని ఎన్నుకోమని చెప్పరు. నిజాలు చెప్పే వాడిని ఈ సమాజం నిందించి అవమానించడానికి కూడా వెనకాడదు అందువల్ల నిజాయితీపరుడైన వ్యక్తి ఎలాంటి నీచుల ముందు ఎలాంటి సత్యభాషన చేయకూడదు అని వేదం తెలిసిన వారు చెప్పే మాట నిజాయితీగా జీవితాన్ని కొనసాగించేవారు చాలామంది ఉన్నారు సమాజంలో అలాంటి వారి ముందు ఇలాంటి నిజాలు చెప్పాలి తప్ప ప్రతి ఒక్కరి దగ్గర నిజాలు చెప్పకూడదు అని వన మనకు నీతిగా తెలియజేస్తున్నాడు వారి జీవితంలో ఎలాంటి అనుభవాలు అన్నిటిని చవిచూశాడు అందువల్లనే అంత అందంగా ఈ పద్యాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేశాడు వేమన వారు రాసిన పద్యాన్ని ఒక్కసారి చదవండి.
"నిజములాడు వాని నిందించు జగమెల్ల నిజములాడరాదు నీచుతోను నిజ మహాత్ముగూడి నిజమాడ వలయురా..."
సత్య పాలన- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి