కళలు మనిషి మానో వికాసానికే కాదు,సాంఘీక దురాచారాలను రూపుమాపేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి.అదే కోవలో రచించబడిన వేలాది రచనను వచ్చాయి వస్తూనే ఉంటాయి.కారణం మనిషి సంపూర్ణ విజ్ఞానవంతుడు కాకపోవడమే స్వార్ధం విడనాడలేక పోవడమే ఆప్రయత్నంలో....సత్యం (1921) చిత్రంగి (1923) శివం (1923) సుందరం
(1926) శాలిని (1927) శశాంక (1927) సావిత్రి (1930) మంగమ్మ(1947) పద్మరాణి (1947) పురూరవ మెదలగునవి స్త్రీ వాదనాటకాలు.సంఘంలో స్త్రీ పురుష అసమానతలు,స్త్రీల సాంఘీక బానిసత్వం,అర్ధలేని నిరర్ధకమైన కట్టుబాట్లపై ప్రతిఘట నాత్మక నాటకాలు శ్రీగుడిపాటి వెంకటాచలం రచించారు.
1908/ జూలై /7 న మద్రాసులోని సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించారు. పద్మావతికి చదువుతో పాటు సంగీతం నేర్పించారు.వీరి తల్లి,తండ్రి సంఘసంస్కరణోద్యమ సంస్ధలో క్రియశీలకంగా పనిచేస్తుండే వారు.వీరి వివాహాన్ని స్వయంగా కందుకూరు వీరేశలింగం పంతులుగారు దగ్గరఉండి జరిపించారు.
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం తమ్ముడు కొమ్మూరి వెంకట రామయ్య గారితో పద్మావతి గారి పధ్నాలుగో ఏట వివాహం జరిగింది.
బాల్యంలో తాత గారు దత్తు తీసుకోవడం వలన చలంగారి ఇంటిపేరు కొమ్మురినుండి గుడిపాటికి మారిపోయింది.
అభ్యుదయ భావాలకు ఆనవాలైన కొమ్మూరి వెంకట్రామయ్యగారికి ఆరోజుల్లో తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది.స్త్రీ లపాత్రలు స్త్రీలే ధరించాలి అని మహానటుడు బళ్ళారి రాఘవ గారికి పిలుపుకు స్పందించిన కొమ్మూరి వారు తనభార్యను రాఘవా గారి ట్రూపులో నటించడానికి పంపారు. ఆరోజుల్లో కుటుంబ స్త్రీలు రంగస్ధలంపై నటించడం పెద్ద సంచలనం. పద్మావతి గారికి 1926లో రెండో సంతానంగా ప్రముఖ రచయిత 'కొమ్మూరి సాంబశివరావు ' గారు జన్మించారు.
పద్మావతి గారు ' ప్రహ్లాద ' నాటకంలో లీలావతి పాత్రపోషించేవారు.అలా రామదాసు,తప్పెవరిది,సరిపడని సంగతులు,చంద్రగుప్త,ఆలోకంనుండి ఆహ్వానం మెదలైన నాటకాలు రాఘవగారితో కలసి నటించేవారు. ' మహత్మ గాంధీ ' డాక్యుమెంటరీ చిత్రానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అనంతరం సినీరంగ ప్రవేశంచేసి 'ద్రౌపతి మాన సంరక్షణం' ' రైతుబిడ్డ '
' సుమతి ' ' పెద్దమనుషులు ' చిత్రాలలో నటించారు. స్త్రీల సమస్యలపై ఎన్నో రేడియో ప్రసంగాలు చేసారు.ఏనాడు సన్మానాలు,బిరుదులు ఆశించకుండా కళమానవ ప్రయోజనానికే అని నమ్మి తుదిశ్వాసవరకు కళారంగానికి సేవలు అందించిన ఈధన్యజీవిని అభినందిద్ధాం1970/ మే /9 వతేదిన చెన్నయ్ లో శారదాదేవి పాద సేవకై బ్రహ్మలోకం తరలివెళ్ళారు.
(1926) శాలిని (1927) శశాంక (1927) సావిత్రి (1930) మంగమ్మ(1947) పద్మరాణి (1947) పురూరవ మెదలగునవి స్త్రీ వాదనాటకాలు.సంఘంలో స్త్రీ పురుష అసమానతలు,స్త్రీల సాంఘీక బానిసత్వం,అర్ధలేని నిరర్ధకమైన కట్టుబాట్లపై ప్రతిఘట నాత్మక నాటకాలు శ్రీగుడిపాటి వెంకటాచలం రచించారు.
1908/ జూలై /7 న మద్రాసులోని సంఘసంస్కర్తల కుటుంబంలో జన్మించారు. పద్మావతికి చదువుతో పాటు సంగీతం నేర్పించారు.వీరి తల్లి,తండ్రి సంఘసంస్కరణోద్యమ సంస్ధలో క్రియశీలకంగా పనిచేస్తుండే వారు.వీరి వివాహాన్ని స్వయంగా కందుకూరు వీరేశలింగం పంతులుగారు దగ్గరఉండి జరిపించారు.
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం తమ్ముడు కొమ్మూరి వెంకట రామయ్య గారితో పద్మావతి గారి పధ్నాలుగో ఏట వివాహం జరిగింది.
బాల్యంలో తాత గారు దత్తు తీసుకోవడం వలన చలంగారి ఇంటిపేరు కొమ్మురినుండి గుడిపాటికి మారిపోయింది.
అభ్యుదయ భావాలకు ఆనవాలైన కొమ్మూరి వెంకట్రామయ్యగారికి ఆరోజుల్లో తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది.స్త్రీ లపాత్రలు స్త్రీలే ధరించాలి అని మహానటుడు బళ్ళారి రాఘవ గారికి పిలుపుకు స్పందించిన కొమ్మూరి వారు తనభార్యను రాఘవా గారి ట్రూపులో నటించడానికి పంపారు. ఆరోజుల్లో కుటుంబ స్త్రీలు రంగస్ధలంపై నటించడం పెద్ద సంచలనం. పద్మావతి గారికి 1926లో రెండో సంతానంగా ప్రముఖ రచయిత 'కొమ్మూరి సాంబశివరావు ' గారు జన్మించారు.
పద్మావతి గారు ' ప్రహ్లాద ' నాటకంలో లీలావతి పాత్రపోషించేవారు.అలా రామదాసు,తప్పెవరిది,సరిపడని సంగతులు,చంద్రగుప్త,ఆలోకంనుండి ఆహ్వానం మెదలైన నాటకాలు రాఘవగారితో కలసి నటించేవారు. ' మహత్మ గాంధీ ' డాక్యుమెంటరీ చిత్రానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అనంతరం సినీరంగ ప్రవేశంచేసి 'ద్రౌపతి మాన సంరక్షణం' ' రైతుబిడ్డ '
' సుమతి ' ' పెద్దమనుషులు ' చిత్రాలలో నటించారు. స్త్రీల సమస్యలపై ఎన్నో రేడియో ప్రసంగాలు చేసారు.ఏనాడు సన్మానాలు,బిరుదులు ఆశించకుండా కళమానవ ప్రయోజనానికే అని నమ్మి తుదిశ్వాసవరకు కళారంగానికి సేవలు అందించిన ఈధన్యజీవిని అభినందిద్ధాం1970/ మే /9 వతేదిన చెన్నయ్ లో శారదాదేవి పాద సేవకై బ్రహ్మలోకం తరలివెళ్ళారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి