నాటితరం నట,గాయని,నిర్మాత,నాటితరం కధానాయకుల అందరి సరసన నటించిన కృష్ణవేణి 1924 డిసెంబర్ 24న పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో డాక్టర్ యర్రంశెట్టికృష్ణారావు వారి యింట ఈమె జన్మించారు.బాల్యంలో ధృవుడు,ప్రహ్లాదుడు వంటి పాత్రలుధరిస్తూ నటనపై అభిమానం పెంచుకున్నారు.
తులాభారంలో ఈమె నటన చూసి ముచ్చటపడ్డారు రేలంగి , ఆరోజుల్లో ఆయన ప్రోడక్షన్ మేనేజర్ గా పనిచేస్తుండేవారు.ఆయన ప్రముఖ దర్మకులు సి.పుల్లయ్య గారికి కృష్ణవేణిని పరిచయంచేయగా,తను నిర్మించే తొలి బాలల చిత్రం ' అనసూయ ధృవ ' (1935) చిత్రంలో తొలి సారి వెండి తెరపై కనిపించి ' జో అచ్చుతానంద ' అని పాడుకున్నారు..అలా 1955 వరకు చిత్రసీమకు తమవంతు సేవలు అందించారు.అప్పుడు ఆమె వయసు పదేళ్ళు. అనంతరం సి.యస్ .ఆర్ .గారిప్రోత్సాహంతో ' తుకారాం ' (1937) చిత్రంలో నటించారు.అనంతరం ' కచదేవయాని ' (1938)చిత్రంలో దేవయానిగా నటించి ' ప్రేమమహిమగన్ ' పాటపాడారు .అనంతరం
' మహనంద ' (1939) చిత్రంలో నటిస్తున్నసమయంలో ' మీర్జాపురంరాజా ' వారితో వివాహం విజయవాడలో జరిగింది.వివాహనంతరం మీర్జాపురం రాజావారు నిర్మించిన ' కాళిదాసు ' చిత్రంలో నటించారు అనంతరం వారి సొంత స్టూడియో శోభనాచల బాధ్యతలు నిర్వహిస్తూ తాము నిర్మించే చిత్రాలలోమాత్రమే నటిస్తూ ' జీవనజ్యోతి ' (1940) ' దక్షయజ్ఞం ' (1941)
వీరికి అనురాధ అనేకుమార్తే 1942లోజన్మించారు.
' భీష్మ ' (1944) (ఈచిత్రంలో రఘపతి వెంకయ్యనాయుడు గారి కుమారుడు ప్రకాష్ నటించారు) తమకుమార్తె పేరున మేకా రాజ్యలక్ష్మి అనురాధ పేరున ' యం.ఆర్ .ఏ.ప్రోడక్షన్స్ ప్రారంభించి కృష్ణవేణి నిర్మాతగా వ్యవహరించేవారు.ఈ సంస్ధ నిర్మించిన తొలి చిత్రం ' మనదేశం ' (1949) తొలి జాతీయోద్యమ పొరాట కథాంశంగా నిర్మింపబడిన ఈచిత్రం ద్వారా ' నందమూరి వారు పరిచయం చేయబడ్డారు. గాయని లీలగారు కూడా ఈచిత్రంలో తొలిసారి పరిచయం అయ్యరు. ' వరూధిని ' చిత్రం అనంతరం సొంతఊరువెళ్ళిన ఎస్ .వి .రంగారావును పిలిపించి ఇందులో వేషం ఇచ్చారు. పుల్లయ్య గారి దర్మకత్వంలో ఈమె నటించిన ' గొల్లభామ ' (1947) చిత్రంలో నటిస్తూ ఈమె పాడిన పద్యం ' భూపతినిచంపితిన్ '
' లక్షమ్మ' (1950) చిత్రం పోటిగా నిర్మించి విజయంసాధించారు. ఆరోజుల్లో కృష్ణవేణి నటించిన ' ధర్మాంగద ' (1949) చిత్రానికి 46 వేలరూపాయల పారితోషకం తీసుకున్నారు. వీరు నిర్మించిన ' కీలుగుర్రం ' (1949) చిత్రంలో అంజలిదేవికి పాటలు ఈమె పాడారు.' తిరుగుబాటు ' చిత్రంలో వాంప్ గా హుందాగా నటించారు.వీరు నిర్మించిన ' గుడ్ ఈవెనింగ్ ' ' లేడిడాక్టర్ ' చిత్రాలు పరాజయంపాలు అయ్యయి. ' సవాసం ' (1952) ఈమె నటించిన చివరి చిత్రం.నిర్మతగా ఈమె నిర్మించిన చివరి చిత్రం ' దాంపత్యం ' (1957) ఈచిత్ర ద్వారా రమేష్ నాయుడు సంగీతదర్మకుడుగా పరిచయం అయ్యారు.
'రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం యిచ్చి వీరిని గౌరవించారు వీరి కుమార్తే అనురాథ నిర్మాతగా కొన్నిచిత్రాలు నిర్మించారు.ప్రస్తుతం తమ కుమార్తె వద్ద శేషజీవితం ప్రశాంతంగా గడుపుతున్నారు.
తులాభారంలో ఈమె నటన చూసి ముచ్చటపడ్డారు రేలంగి , ఆరోజుల్లో ఆయన ప్రోడక్షన్ మేనేజర్ గా పనిచేస్తుండేవారు.ఆయన ప్రముఖ దర్మకులు సి.పుల్లయ్య గారికి కృష్ణవేణిని పరిచయంచేయగా,తను నిర్మించే తొలి బాలల చిత్రం ' అనసూయ ధృవ ' (1935) చిత్రంలో తొలి సారి వెండి తెరపై కనిపించి ' జో అచ్చుతానంద ' అని పాడుకున్నారు..అలా 1955 వరకు చిత్రసీమకు తమవంతు సేవలు అందించారు.అప్పుడు ఆమె వయసు పదేళ్ళు. అనంతరం సి.యస్ .ఆర్ .గారిప్రోత్సాహంతో ' తుకారాం ' (1937) చిత్రంలో నటించారు.అనంతరం ' కచదేవయాని ' (1938)చిత్రంలో దేవయానిగా నటించి ' ప్రేమమహిమగన్ ' పాటపాడారు .అనంతరం
' మహనంద ' (1939) చిత్రంలో నటిస్తున్నసమయంలో ' మీర్జాపురంరాజా ' వారితో వివాహం విజయవాడలో జరిగింది.వివాహనంతరం మీర్జాపురం రాజావారు నిర్మించిన ' కాళిదాసు ' చిత్రంలో నటించారు అనంతరం వారి సొంత స్టూడియో శోభనాచల బాధ్యతలు నిర్వహిస్తూ తాము నిర్మించే చిత్రాలలోమాత్రమే నటిస్తూ ' జీవనజ్యోతి ' (1940) ' దక్షయజ్ఞం ' (1941)
వీరికి అనురాధ అనేకుమార్తే 1942లోజన్మించారు.
' భీష్మ ' (1944) (ఈచిత్రంలో రఘపతి వెంకయ్యనాయుడు గారి కుమారుడు ప్రకాష్ నటించారు) తమకుమార్తె పేరున మేకా రాజ్యలక్ష్మి అనురాధ పేరున ' యం.ఆర్ .ఏ.ప్రోడక్షన్స్ ప్రారంభించి కృష్ణవేణి నిర్మాతగా వ్యవహరించేవారు.ఈ సంస్ధ నిర్మించిన తొలి చిత్రం ' మనదేశం ' (1949) తొలి జాతీయోద్యమ పొరాట కథాంశంగా నిర్మింపబడిన ఈచిత్రం ద్వారా ' నందమూరి వారు పరిచయం చేయబడ్డారు. గాయని లీలగారు కూడా ఈచిత్రంలో తొలిసారి పరిచయం అయ్యరు. ' వరూధిని ' చిత్రం అనంతరం సొంతఊరువెళ్ళిన ఎస్ .వి .రంగారావును పిలిపించి ఇందులో వేషం ఇచ్చారు. పుల్లయ్య గారి దర్మకత్వంలో ఈమె నటించిన ' గొల్లభామ ' (1947) చిత్రంలో నటిస్తూ ఈమె పాడిన పద్యం ' భూపతినిచంపితిన్ '
' లక్షమ్మ' (1950) చిత్రం పోటిగా నిర్మించి విజయంసాధించారు. ఆరోజుల్లో కృష్ణవేణి నటించిన ' ధర్మాంగద ' (1949) చిత్రానికి 46 వేలరూపాయల పారితోషకం తీసుకున్నారు. వీరు నిర్మించిన ' కీలుగుర్రం ' (1949) చిత్రంలో అంజలిదేవికి పాటలు ఈమె పాడారు.' తిరుగుబాటు ' చిత్రంలో వాంప్ గా హుందాగా నటించారు.వీరు నిర్మించిన ' గుడ్ ఈవెనింగ్ ' ' లేడిడాక్టర్ ' చిత్రాలు పరాజయంపాలు అయ్యయి. ' సవాసం ' (1952) ఈమె నటించిన చివరి చిత్రం.నిర్మతగా ఈమె నిర్మించిన చివరి చిత్రం ' దాంపత్యం ' (1957) ఈచిత్ర ద్వారా రమేష్ నాయుడు సంగీతదర్మకుడుగా పరిచయం అయ్యారు.
'రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కారం యిచ్చి వీరిని గౌరవించారు వీరి కుమార్తే అనురాథ నిర్మాతగా కొన్నిచిత్రాలు నిర్మించారు.ప్రస్తుతం తమ కుమార్తె వద్ద శేషజీవితం ప్రశాంతంగా గడుపుతున్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి