కర్ణాటక సంగీతంలో విశేష స్థానం కలిగిన నాదస్వరం అనే ఈ వాద్యం అత్యంత మంగళ ప్రథమైనదిగా భావిస్తారు. దేవాలయాల్లోనూ మత, సామాజికపరమైన కార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన వాద్యం ఈ నాదస్వరం. కచేరీలలో విరివిగా ఉపయోగించు వాద్యం కూడా ఇది. దక్షిణభారతంలో కర్నాటక సంగీతానికి పొడవైన సన్నాయిని వాడితే ఉత్తర భారతంలో హిందుస్తానీ సంగీతానికి పొట్టిదైన షెహనాయ్ని వాడుతారు. పురాణాల నుండి ఈ వాద్యముని వాయించడానికి ప్రత్యేఖమైన తెగ ఉన్నది వారిని నాద బ్రాహ్మణులు, మంగళాకారులు అని సంబోధించేవారు. అందుకే మంగళవారు వాయించే వాద్యము కనుక "నాదస్వరమును, తవిల్(డోలు)ను" మంగళ వాద్యములుగా పరిగనిస్తారు. నాదస్వరాన్నే "సన్నాయి" అని తెలుగు ప్రజలు పిలుస్తారు. వేణువులాంటి సన్నని గొట్టం ఆకారాన్ని సంస్కృత భాషలో “నాడి” అంటారు. నాయీ అనే పార్శీ పదానికి ఈ నాడి మూలం కావచ్చు. షెహ్ (గాలి ఊదటం-breathing), "నాయి(లేక)నాయీ" అనే పదాల కలయికగా షెహనాయి ఏర్పడింది. ఈ "నాయి (లేక) నాయీ" పదం తెలుగు నేలమీద ఎంతగా స్థిరపడిందంటే, సన్నాయి వాయించే సామాజిక వర్గాన్ని నాయి బ్రాహ్మణులుగా వ్యవహరింప చేసి, వారికి ఒక సామాజిక గౌరవాన్ని సంతరింప చేసింది సన్నాయి.
నాదస్వరం - దీనికి రెండు పీకలుంటాయి. రెండు ప్రత్యేకమైన భాగాలుండి క్రిందవైపు పెద్ద ఉదరం బిగించిన పొడవాటి గొట్టంలా ఉంటుంది. దీని పార్శ్వభాగమున ఎనిమిది వేళ్ళ రంద్రాలు ఉండి నాలుగు గాలి బయటకు పోయే రంధ్రాలూ ఉంటాయి. దీనికి పైన బిగించిన కొయ్యంతో చేసిన డబుల్ రీడ్ నుండి ద్వని జనిస్తుంది.
పురాణాల నుండి సంగీతం వాయిద్యాలను వాయించడానికి ప్రత్యేక తెగ ఉంది వారినే నాదబ్రాహ్మణులు (నాదం అనగ శబ్ధం) అంటారు విరినే నాయిబ్రాహ్మణులు, మంగళ బ్రాహ్మణ అని అంటారు. నాదస్వరము, డోలుని మంగళ వాయిద్యాములు అని అంటారు ఎందుకనగా "మంగళ" వారు వాయించే వాయిద్యాములు కనుకా డోలు, నాదస్వరముని మంగళ వాయిద్యాములు అని అంటారు..
నాదస్వరం ప్రధానంగా వినిపించే కొన్ని గీతాలు...
' టైటిల్ ' సీతారామ కల్యాణం .మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి ( అడవి రాముడు ) నీలీలపాడెద దేవా( మురిపించే మువ్వలు ) ' సన్నాయి రాగానికి ' సన్నాయి అప్పన్న. ' కొమ్మ కొమ్మకో సన్నాయి ' గోరింటాకు . ' పున్నాగ తోటల్లో సన్నాయి పాడింది ' వియ్యల వారి కయ్యాలు ' . ' వెన్నెల్లో విన్నా సన్నాయి ' తాతయ్య ప్రేమ లీలలు .
' అన్ని మంచి శకకునములే ! ' శ్రీకృష్ణార్జున యుధ్ధం . ' కళ్ళలో పెళ్ళి పందిరి ' ఆత్మీయులు . 'ఖషీ ఖుషీగా నవ్వుతూ ' ఇద్దరు మిత్రులు .వంటి చిత్రాలలోని పాటల్లో సన్నాయి ( నాదస్వరం) ప్రస్ధావన వస్తుంది.
సన్నాయి ప్రధానంగా సినిమాలు. సన్నాయి అప్పన్న,దేవరకొండ వీరయ్య , సూత్రధారులు ...
నాదస్వరం - దీనికి రెండు పీకలుంటాయి. రెండు ప్రత్యేకమైన భాగాలుండి క్రిందవైపు పెద్ద ఉదరం బిగించిన పొడవాటి గొట్టంలా ఉంటుంది. దీని పార్శ్వభాగమున ఎనిమిది వేళ్ళ రంద్రాలు ఉండి నాలుగు గాలి బయటకు పోయే రంధ్రాలూ ఉంటాయి. దీనికి పైన బిగించిన కొయ్యంతో చేసిన డబుల్ రీడ్ నుండి ద్వని జనిస్తుంది.
పురాణాల నుండి సంగీతం వాయిద్యాలను వాయించడానికి ప్రత్యేక తెగ ఉంది వారినే నాదబ్రాహ్మణులు (నాదం అనగ శబ్ధం) అంటారు విరినే నాయిబ్రాహ్మణులు, మంగళ బ్రాహ్మణ అని అంటారు. నాదస్వరము, డోలుని మంగళ వాయిద్యాములు అని అంటారు ఎందుకనగా "మంగళ" వారు వాయించే వాయిద్యాములు కనుకా డోలు, నాదస్వరముని మంగళ వాయిద్యాములు అని అంటారు..
నాదస్వరం ప్రధానంగా వినిపించే కొన్ని గీతాలు...
' టైటిల్ ' సీతారామ కల్యాణం .మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి ( అడవి రాముడు ) నీలీలపాడెద దేవా( మురిపించే మువ్వలు ) ' సన్నాయి రాగానికి ' సన్నాయి అప్పన్న. ' కొమ్మ కొమ్మకో సన్నాయి ' గోరింటాకు . ' పున్నాగ తోటల్లో సన్నాయి పాడింది ' వియ్యల వారి కయ్యాలు ' . ' వెన్నెల్లో విన్నా సన్నాయి ' తాతయ్య ప్రేమ లీలలు .
' అన్ని మంచి శకకునములే ! ' శ్రీకృష్ణార్జున యుధ్ధం . ' కళ్ళలో పెళ్ళి పందిరి ' ఆత్మీయులు . 'ఖషీ ఖుషీగా నవ్వుతూ ' ఇద్దరు మిత్రులు .వంటి చిత్రాలలోని పాటల్లో సన్నాయి ( నాదస్వరం) ప్రస్ధావన వస్తుంది.
సన్నాయి ప్రధానంగా సినిమాలు. సన్నాయి అప్పన్న,దేవరకొండ వీరయ్య , సూత్రధారులు ...
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి