రాజ్యాంగం- ...కోరాడ నరసింహా రావు

 పల్లవి :-
ఓ భారతీయులారా ..... !
 మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులెక్కడున్నవి !?
భాద్యతలను నెరవేర్చే పౌరు లెవరు ఉన్నారు.. ?!
     " మనభారత రాజ్యా.... "
చరణం :-
రాసుకున్న గ్రంధానికె, పరిమితమై ఉన్నవి అవి  అన్నీ !
   చట్టాలు బలవంతుల చుట్టాలై పోయాయి !
 చేతగాక అర్భకులు చతికిల బడిపోయారు !!
  న్యాయం - ధర్మం నేటికీ నీరసపడి పోయెను...,
  " ఓ భారతీయుడా.... "
చరణం :-
    ఓ మేధావులారా... !
 చోద్యం చూసేరా.... !!
   మహనీయుల ఆశయాలు నెరవేర్చగ రారా... !రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించగ మీరు 
ప్రతిన బూనలేరా.... !!
   ప్రతిన బూన లేరా... !
      ******
.
కామెంట్‌లు