రాజ్యాంగం -రూప
 ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకుని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. కాబట్టి 2015 నుంచీ ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం.
1949లో ఆమోదం లభించినా గానీ 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నవంబరు 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది.
కానీ, భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలను నిర్వహిస్తున్నాం.
రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ఏడాది నవంబరు 26కు 73 ఏళ్లు పూర్తవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం.
                       

కామెంట్‌లు