తానా ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట జిల్లాల సమన్వయ కర్త ( కో ఆర్డినేటర్ )
బోట్స్ వానాలో ఘనంగా ప్రారంభమైన చిగురుమళ్ళశ్రీనివాస్ వంద దేశాల శాంతి సద్భావన ప్రపంచ యాత్ర
------------------------------
ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ లో హై కమిషనర్ భరత్ కుమార్ కూతాటి, నగర మేయర్ అబ్రహాం ఆస్టిన్ చేతుల మీదుగా ప్రారంభం
-----------------------------
వీడియో సందేశం ద్వారా పాల్గొన్న బోట్స్ వానా లోకల్ గవర్నమెంట్ మరియు రూరల్ డెవలప్మెంట్ మంత్రులు మాబ్యూస్ పూలే
------------------------------
ఇది సాహిత్య చరిత్రలో అపూర్వ ఘట్టం అంటూ వెల్లడించిన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి
-----------------------
పెద్ద సంఖ్యలో హాజరైన బోట్స్వానా అధికార అనధికార ప్రముఖులు
------------------------
బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన భారీ సభ
శాంతి సధ్భావన యాత్ర కు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక కార్యవర్గం
వందేవిశ్వమాతరమ్ పేరుతో శత శతక కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ చేపట్టిన 100 దేశాల శాంతి సద్భావన ప్రపంచ యాత్ర ప్రారంభ సభ బోట్స్వానా రాజధాని గాబరాన్ లో ఘనంగా జరిగింది. ఈ శాంతి సధ్భావన యాత్ర కు తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక జాతీయ అధ్యక్షులు పిఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి, వందే విశ్వ మాతరమ్ సమన్వయకర్త మోటూరి నారాయణరావు, వందే విశ్వ మాతరమ్ సమన్వయకర్త డాక్టర్ ఆలపాటి శుభాకాంక్షలు తెలిపారు. ఆఫ్రికా లోని బోట్స్ వానాలో జరిగిన సభ ఇండియన్ హై కమిషన్ ఆఫీసులో జరగటం విశేషం.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు 100 దేశాల్లోని 100 తెలుగు సంఘాల సారధ్యంలో సాగుతున్న ఈ యాత్ర తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానాపూర్వ అధ్యక్షులు వందే విశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి, బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది.
బండ్ల హనుమయ్య, జంపాల చౌదరి, డా. తోట కూర ప్రసాద్
శ్రీనాథ్ కుర్రా,
శిరీష తూనుగుంట్ల, లక్ష్మి దేవినేని, అశోక్ కొల్లా, వెంకట్ తరిగోపుల, సుమంత్ రామ్ శెట్టి, మురళి తాళ్ళూరి, మనోరమ గొంది తదితరులు నిర్వహణలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
రెండు సంవత్సరాల పాటు100 దేశాల్లో సాగుతుంది.
100 దేశాల ప్రపంచ యాత్ర ప్రారంభసభలో వీడియో సందేశం ద్వారా తానా అధ్యక్షులు నిరంజన్
శృంగవరపు మాట్లాడుతూ తెలుగు వెలుగులు వెదజల్లుతూ విశ్వశాంతి, సౌభ్రాతృత్వాల కోసం చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల ప్రపంచ యాత్ర చేపట్టడం అభినందనీయం.
ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా తానా నిర్వహిస్తుందని దీని ముగింపు సభ 2025 లో అమెరికా లో జరుగ బోయ జరగనున్న తానా మహాసభలలో జరుగుతోంది.
అన్నారు. వందేవిశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్లూరి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ తెలుగు సాహిత్యం ద్వారా విశ్వశాంతి సందేశం ఇస్తూ, మానవ సమాజాన్ని చైతన్యాన్ని కలిగించే ఈ బృహత్ కార్యక్రమం సమాజంలో కొంతైనా మార్పు తీసుకువస్తుందని భావిస్తున్నాము. ముఖ్యంగా భావితరాలలో మానవీయ విలువలను ప్రబోధిస్తుందని అన్నారు. ప్రారంభసభకు బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వరరావు సభా అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఇండియన్ హై కమిషనర్ భరత్ కుమార్ కూతాటి మాట్లాడుతూ ఈనాడు ప్రపంచశాంతి,సౌభ్రాతృత్వాలు ఎంతో అవసరం. సాహిత్యం ద్వారా మానవాళికి మహా సందేశాన్ని ఇవ్వటానికి 100 దేశాల ప్రపంచ యాత్ర చేస్తున్న చిగురుమళ్ళ అభినందనీయులు, తానాకి మరియు ఇతర తెలుగు సంఘాలకి అభినందనలు, బోట్స్ వానా తెలుగు సంఘం వారికి అభినందనలు తెలియజేశారు.
విశిష్ట అతిథిగా హాజరైన గాబరాన్ మేయర్ అబ్రహాం ఆస్టిన్ మాట్లాడుతూ ఇటువంటి గొప్ప సంఘటన మా నగరంలో జరగటం మా అదృష్టం అన్నారు.
బోట్స్ వానా లోకల్ గవర్నమెంట్ మరియు రూరల్ డెవలప్మెంట్ మంత్రివర్యులు మాబ్యూస్ పూలే వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ అసాధారణం ఈ యాత్ర, అనితర సాధ్యం ఈ యాత్ర ఇది ఈనాడు అవసరమైన యాత్ర. మనుషులలో ఉన్న అశాంతిని ఆందోళన ను తొలగించటానికి సాహిత్యం ఒక బలమైన ఆయుధమని సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం కలిగించటానికి పూనుకున్న కవికి, తానా కి , తెలుగు సంఘాలకు అభినందనలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆఫ్రికా దేశస్థులతో, పాటు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు.
అని చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలిపారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి