ఖతర్ లో ఘనంగా చిగురుమళ్ళ శ్రీనివాస్ 100 దేశాల శాంతియాత్ర
 ఖతర్ రాజధాని దోహా నగరంలో చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న 100 దేశాలలో శాంతి సద్భావనా ప్రపంచ యాత్ర ఘనంగా జరిగింది. 
ఆంధ్ర కళా వేదిక- ఖతర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేలాదిమంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
AKV అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ 
ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటటానికి సాహిత్యం ద్వారా సామాజిక చైతన్య కలిగించడానికి  శ్రీనివాస్ గారు "వందే విశ్వమాతరమ్" పేరుతో వంద దేశాల శాంతి సద్భావనా యాత్ర నిర్వహించటం అభినందనీయమని అన్నారు. 
చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా మరియు 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ మాతరమ్ చైర్మన్ 
జయశేఖర్ తాళ్ళూరి సారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతోంది. 
నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికా ఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలో భాగంగా మధ్య ప్రాచ్య  దేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నాము. మానవ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం సాహిత్యం ద్వారా  సాధ్యమవుతుందని అన్నారు.
మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లుగా సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో  
AKV కార్యదర్శి విక్రమ్ సుఖవాసి, శ్రీసుధ, శిరీష, VBK మూర్తి,
సాయి రమేష్,  సోమరాజు, శేఖరం రావు  తదితరులు *పాల్గొన్నారు.
 డా. అరుణాకోదాటి
తానా
వందేమాతరం  సమన్వయ కర్త

కామెంట్‌లు