రుక్మాపూర్ అంగన్వాడి కేంద్రంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం- వెంకట్ మొలక ప్రతినిధి
  Ups పాఠశాలలో
దాతల సహకారంతో బెంచీలు పంపిణీ
వికారాబాద్ జిల్లా పెద్దే ముల్ మండలం
యుపిఎస్ రుక్మాపూర్ పాఠశాలలో
అంగన్వాడి చిన్నారులకు
సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా రుక్మాపూర్ గ్రామస్తులు  ఎన్నారై ప్రదీప్ రావు
 కవయిత్రి  మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో
పాఠశాల హెచ్ఎం
ఉపాధ్యాయ బృందం
మొదట సరస్వతి పూజ నిర్వహించిన అనంతరం
అంగన్వాడి చిన్నారులకు
సామూహిక అక్షరాభ్యాసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రుక్మాపూర్ గ్రామస్తులు
ఎన్నారై ప్రదీప్ రావు
పాఠశాల మౌలిక సదుపాయాలు లేకపోవడంతో
 బెంచీల కోసం 15 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో ప్రదీప్ రావు
 పాల్గొని మాట్లాడుతూ
నేను కూడా ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలలను చదువుకొని
ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని ఉన్నత స్థాయికి రావడం జరిగిందని తాను  అమెరికాలో  జాబ్ చేస్తున్నానని పాఠశాలకు ఉడుత భక్తిగా సాయం అందిస్తున్నారని భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి  సహాయ సహకారాలు అందిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కవయిత్రి  మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు  KVM వెంకట్ పాల్గొని మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసమే గత 20 సంవత్సరాల నుండి
కృషి చేస్తున్నామని
  తాండూర్ నియోజకవర్గంలో రోటరీ క్లబ్ సికింద్రాబాద్  వెస్ట్ వారి సౌజన్యంతో 600 బెంచీలు అందించడం జరిగిందని
భవిష్యత్తులో రుక్మాపూర్ పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో
చిన్నారుల నృత్యాలు అలరించాయి
అనంతరం సహకరించిన దాతలకు ఉపాధ్యాయులుసన్మానించారు
పాఠశాల హెచ్ఎం భాగ్యలక్ష్మి
గ్రామస్తులు రిటైర్డ్ విఆర్ఓ మనోహర్రావు దంపతులు
మంబాపూర్  LFL హెచ్ఎం వీరప్ప ఎస్ఎంసి కమిటీ చైర్మన్ రాములు
ఉపాధ్యాయులు శివకుమార్ రమేష్, పుష్పలత ,వసంత
అంగన్వాడి టీచర్ లక్ష్మి
శిక్షణ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ప్రభు
విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు.

కామెంట్‌లు