పద్య ధారణ పోటీల్లో విజేతలకు బహుమతులు
 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొగుట , తొగుట మండలం, సిద్దిపేట  జిల్లా  
వందేమాతరం ఫౌండేషన్ వారి సౌజన్యంతో  ఫిబ్రవరి 21 నపాఠశాల ‌రథసారథులు‌ ప్రధానోపాధ్యాయులు శ్రీ  ఏ.ఉపేందర్ గారి అధ్యక్షతన  ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థుల‌ సమక్షంలో  పద్య ధారణ పోటీలు , 10 వ తరగతి విద్యార్ధులకు  తెలుగు వ్యాకరణం, ఛందస్సు, పదజాలం పై క్విజ్  మరియు  పాటల పోటీలు  నిర్వహించారు . ఈ‌ కార్యక్రమంలో  బహుమతులను వందేమాతరం ఫౌండేషన్ వారు అందజేశారు. 
వెలకట్టలేని  పుస్తక భాండాగారాన్ని  గ్రంథాలయానికి  బహుకరించారు. మా పాఠశాల  విద్యార్థులు 6,7 వ తరగతి పిల్లలు  65 పద్యాలకు ‌పైగా శతక‌పద్యాలు కంఠస్థం చేశారని తెలుపుటకు సంతోషిస్తూ, వందేమాతరం ఫౌండేషన్ ‌  వారికి  పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు  ఉపాధ్యాయినీ , ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది , విద్యార్థినీ విద్యార్థులు పేరు పేరునా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాము.
ప్రధానోపాధ్యాయులు 
జి.ప.ఉ.పా.తొగుట 
మండలం తొగుట 
సిద్దిపేట జిల్లా.

కామెంట్‌లు