మొల్ల విరులు వికసించి
పరిమళాన్ని వెదజల్లుతున్నాయి
ఆ సుగందాన్ని మనమందరం
ఆస్వాదించాలి.
*ఆ సిరా చుక్కలు
నిర్దేశిస్తున్నాయి ఒక నూతన
మార్గం ఆ దారిలో మనమందరం నడవాలి.
*అక్షర జ్యోతి కాంతురేఖలను
సాహిత్య వనములో ప్రసరింపజేసిన ఆమెను మనం అనుసరించాలి.
*కుమ్మరి కులమున పుట్టి
మట్టిలో మాణిక్యంలా జ్ఞాన సంపదను రమణీయ పదాల దండలో కూర్చుంది.
*కంద పద్యాల కాటిన్యాన్ని
సరళ భావంతో వర్ణించిన ఆమె శైలిని మనం ఆకలింపు చేసుకోవాలి.
*రామాయణ పాత్రలు
హృదయాంతరంలో అదృశ్యంగా దర్శనమిస్తాయి
నిర్మలమైన ఆమె ముఖారవిందం రచన శైలిలో కనిపిస్తుంది.
*తొలి తెలుగు కవయిత్రి
విదుషిమణి.భావి భారత కవయిత్రులకు ప్రేరణ ఆమె.
.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి