కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆరోగ్యరీత్యా మనం ఆసనాలు వేయడానికి కూర్చున్నప్పుడు    ఆ భంగిమను  పద్మాసనము అంటారు  అలా కూర్చున్నప్పుడు నీ పంచెంద్రియములు నీ చెప్పు చేతల్లో ఉంటాయి  నీ మనసు నీ అధీనంలో ఉంటుంది  నీవు దేనికోసం ఆ ఆసనంలో కూర్చున్నావో ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది  సమాజానికి హితాన్ని కోరి ఎన్నో  మంచి పనులు చేసిన వ్యక్తిని ఎన్నిక చేసి అతనిని  పద్మభూషణ్ అన్న పేరుతో ప్రభుత్వం సత్కరిస్తుంది  ప్రభుత్వానికి ఉన్న   సేనలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు  పద్మ వ్యూహాన్ని రచిస్తారు  ఆ పద్మవ్యూహంలో నుంచి తప్పించుకోవడం  ఎవరి తరము కాదు  అసలు ప్రవేశించే పద్ధతే వారికి తెలియదు  ఆ ఏర్పాటు అలా ఉంటాయి  అందుకే పద్మం చిరకాలం జ్ఞాపకం పెట్టుకో తగిన  సువాసనతో కూడిన పుష్పం. జీవితాంతం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఆరోగ్య సూత్రాలు ఎలా పాటించాలో తల్లి పిల్లలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి  బ్రహ్మీ ముహూర్తంలో  అంటే ఉదయం 3 గంటల 25 నిమిషాలకు  పిల్లలు లేచే ఏర్పాట్లు చూడాలి  మొదట అలవాటు పడేంత వరకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది పిల్లలకు  కానీ అలవాటు పడిన తర్వాత తల్లి లేపకుండానే అతనే లేచిపోతాడు  అంత ఉదయం నిద్ర లేవగానే ఒక లీటరు గోరువెచ్చని నీళ్లు లేదా  రాగి పాత్రలో నీళ్లు రాత్రి  ఉంచి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తాగాలి  నీరు తాగేటప్పుడు గట గట తాకకూడదు  ఒక గుటక వేసిన తర్వాత మరొక గుటక  కొంచెం సమయం ఇచ్చి దానిని మింగుతూ నిదానంగా  చప్పరిస్తున్నట్టుగా తాగాలి.
నీరు తాగేటప్పుడు ఎప్పుడూ   కూర్చునే తాగాలి  నిలబడి తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయని  వైద్యుడు చెబుతారు  మనం వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత నీళ్లు తాగితే  మూత్ర సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది  ఆ నీరు పరగడుపున  తాగే నీళ్లలో ఒక గ్లాసులో నిమ్మరసం పిండుకుని తాగండి  ఉదయాన్నే టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది  అని వైద్యశాస్త్రజ్ఞులు ఎప్పుడు చెబుతూ ఉంటారు  మీరు ఆ అలవాటును తగ్గించుకోలేని స్థితిలో ఉంటే  టిఫిన్ చేసిన తర్వాత తాగండి  ఉదయమే పరగడుపున తాగాలి అని అనుకుంటే కాషాయాలు తప్ప మిగిలిన ఏ పానీయాలను తాగడానికి వీలు లేదు  దానివల్ల అనేక అనర్థాలు రావడానికి అవకాశం ఉంది.


కామెంట్‌లు