నమ్ము నమ్మకపో! సేకరణ.-అచ్యుతుని రాజ్యశ్రీ

 నేడు మాయలు మంత్రాలతో రోగాలు నయం చేస్తాంఅన్న తాంత్రికులున్నారు.దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చెలామణి అవుతూ డబ్బు గుంజే బడాబాబులున్నారు.కానీబ్రెజిల్ కి చెందిన జోస్ అరిగో అనే వ్యక్తిని డాక్టర్ ఫ్రిట్జ్ ఆత్మ ఆవేశించి ఎలాంటి మత్తు ఇవ్వకుండా జేబులోని చిన్న కత్తితో ఆపరేషన్ చేసేవాడుట!? అలా అతను చేసిన ఆపరేషన్ ని రీల్ లో ఫిల్మ్ గా తీశారు.ఇన్ఫైక్షన్స్ ఎలాంటి సమస్యా లేకుండా 1500 ఆపరేషన్లు చేసిన అద్భుత వ్యక్తి అతను.చిన్న గదిలో కుర్చీ బల్ల తప్ప ఏమీ ఉండేవి కావు.ఎవరూ చనిపోలేదు.ట్యూమర్లు తొలగించే వాడు.ఇది సైకిక్ సర్జన్ ట్రీట్మెంట్ గా ప్రపంచంలో ఖ్యాతి గాంచింది.అతను మెడికల్ సర్జికల్ శిక్షణ పొందలేదు.తన కుడి చెవిలో డాక్టర్ ఫ్రిట్జ్ స్వరం విన్పడ్తూ ఉంటే అలా తాను వింటూ చేతులు కదిలిస్తానని చెప్పేవాడు.ఇప్పటికీ తేలు పాముమంత్రాలు వేసి బాధ తగ్గి పోయేలా చేసే మహానుభావులు ఉన్నారు.నాకు బాగా పరిచయం ఉన్న ఓ అమ్మమ్మ గారు తేలు కుట్టి ఎవరైనా తనదగ్గరకి ఎప్పుడు వచ్చినా సరే ఒక ఇనుప మేకుని మట్టిలో గుచ్చి కొద్ది కొద్దిగా పైన సుత్తి తో కొడుతూ లోలోన మంత్రాలు చదువుతూ ఉండేవారు.ఆవ్యక్తి తన చేత్తో ఆతేలు కుట్టిన భాగాన్ని చేత్తో గట్టిగా విదిలిస్తూ ఉండేవారు.అంతే అరగంట లో బాధతగ్గి నవ్వుతూ వెళ్లి పోయేవారు.ప్రతి సూర్య చంద్ర గ్రహణ కాలం లో ఆమె చాలా నిష్ఠగా ఈ మంత్రాలు దిష్టి మంత్రాలు పఠించేవారు.దిష్ఠి మంత్రం చదువుతూ బాగా ఆవలించేవారు అమ్మమ్మ గారు.ఆమె కుటుంబం లో ఎవరికీ నేర్పలేదు.ఎందుకంటే వారికి ఆఅర్హతలేదు అని ఆమె భావించింది.డబ్బు తీసుకునేది కాదు ఆమె.ఆమె కేవలం 65వ ఏటనే 1980 లో మరణించారు.ఏపుట్టలో ఏపాముందో ఎవరికి తెలుసు?!🌷
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం